Posted on 2025-02-13 21:37:35
డైలీ భారత్, మణిపూర్:మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది, గవర్నర్ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆర్టికల్ 356 అనుసరించి రాష్ట్రపతి పాలనకు గవర్నర్ అజయ్ కుమార్ బల్లా సిఫార్సు చేశారు.
మేరకు ఆ రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించిం ది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఈరోజు సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేసింది. గవర్నర్ పరిధిలోకి అన్ని అధికారాలు తీసుకు వస్తూ నోటిఫికేషన్లో పేర్కొంది.
ఇటీవలే మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.గత రెండేళ్లుగా తీవ్ర అశాంతి నెలకొన్న బీజేపీ పాలిత మణిపూర్ లో బీరేన్ సింగ్ ఆదివారం తన పదవికి రాజీనామా చేయడంతో రాజకీయంగా అనిశ్చితి ఏర్పడింది.
సోమవారం నుంచి జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను రద్దు చేస్తూ గవర్నర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. బీరేన్ సింగ్ తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరినీ ఎంపిక చేయాలో బీజేపీ అధిష్ఠానం తేల్చుకోలేకపోతున్నది. దీంతో కేంద్రానికి రాష్ట్రపతి పాలన విధించడమొక్కటే ప్రత్యామ్నాయంగా కనిపించినట్లు ఉంది.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >
"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి
Posted On 2026-04-18 13:51:32
Readmore >