Posted on 2025-02-13 17:07:35
డైలీ భారత్, మణిపూర్:మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది, గవర్నర్ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆర్టికల్ 356 అనుసరించి రాష్ట్రపతి పాలనకు గవర్నర్ అజయ్ కుమార్ బల్లా సిఫార్సు చేశారు.
మేరకు ఆ రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించిం ది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఈరోజు సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేసింది. గవర్నర్ పరిధిలోకి అన్ని అధికారాలు తీసుకు వస్తూ నోటిఫికేషన్లో పేర్కొంది.
ఇటీవలే మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.గత రెండేళ్లుగా తీవ్ర అశాంతి నెలకొన్న బీజేపీ పాలిత మణిపూర్ లో బీరేన్ సింగ్ ఆదివారం తన పదవికి రాజీనామా చేయడంతో రాజకీయంగా అనిశ్చితి ఏర్పడింది.
సోమవారం నుంచి జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను రద్దు చేస్తూ గవర్నర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. బీరేన్ సింగ్ తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరినీ ఎంపిక చేయాలో బీజేపీ అధిష్ఠానం తేల్చుకోలేకపోతున్నది. దీంతో కేంద్రానికి రాష్ట్రపతి పాలన విధించడమొక్కటే ప్రత్యామ్నాయంగా కనిపించినట్లు ఉంది.
కరీంనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలో అపశృతి
Posted On 2025-03-23 12:33:58
Readmore >మెదక్ ఎంపీ, రఘునందన్ రావు కు జన్మదిన శుభాకాంక్షలు. తెలియజేసిన టెలికం బోర్డు మెంబర్ బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్
Posted On 2025-03-23 10:21:25
Readmore >120 కేజీల గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న బూర్గంపాడు పోలీసులు
Posted On 2025-03-23 03:09:25
Readmore >ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రపంచ కవితా దినోత్సవం వేడుకలు
Posted On 2025-03-21 18:08:13
Readmore >