| Daily భారత్
Logo




పాక్‌ సరిహద్దు వద్ద బాంబు పేలుడు.. ఇద్దరు జవాన్ల మృతి

News

Posted on 2025-02-11 22:20:46

Share: Share


పాక్‌ సరిహద్దు వద్ద బాంబు పేలుడు.. ఇద్దరు జవాన్ల మృతి

డైలీ భారత్, శ్రీనగర్‌ : జమ్మూ కాశ్మీర్‌లో ఐఈడీ పేలుడు సంభవించింది. అక్నూర్ సెక్టార్‌లో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు భారత సైన్యం తెలిపింది. ఆ సమయంలో భారత్-పాక్ సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్.. ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అక్నూర్ సెక్టార్‌లోని లాలియాలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్-ఐఈడీ పేలినట్లు సైన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది.

ఉగ్రవాదుల కోసం గాలింపు..

జమ్మూ కాశ్మీర్‌లో ఐఈడీ పేలుడు సంభవించింది. అక్నూర్ సెక్టార్‌లో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు భారత సైన్యం తెలిపింది. ఆ సమయంలో భారత్-పాక్ సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్.. ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అక్నూర్ సెక్టార్‌లోని లాలియాలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్-ఐఈడీ పేలినట్లు సైన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది.

ఈ ఘటన జరిగిన వెంటనే అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ.. ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నట్లు వైట్ నైట్ కార్ప్స్ వెల్లడించింది. భారత్-పాక్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద సైన్యం గస్తీ కాస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగినట్లు తెలిపింది. ఈ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు సైనికులకు వైట్ నైట్ కార్ప్స్ ట్విటర్ వేదికగా సెల్యూట్ చెప్పింది. వారి త్యాగాలు గుర్తుండిపోతాయని పేర్కొంది.

ఈ ఘటనను భద్రతా బలగాలు చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి అక్కడ దర్యాప్తు ప్రారంభించారు. పేలుడుకు సంబంధించిన విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇక ఇవాళ అక్నూర్ సెక్టార్‌లో మోర్టార్ షెల్‌ను భద్రతా బలగాలు విజయవంతంగా నిర్వీర్యం చేశాయి. నమందార్ గ్రామంలోని ప్రతాప్ కెనాల్ వద్ద ఈ మోర్టార్ షెల్‌ను చూసిన స్థానికులు సైన్యానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సైన్యం.. ఆ మోర్టార్ షెల్ పేలకముందే దాన్ని నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది

Image 1

చండ్రుగొండ మండలంలో మహిళా హత్యకేసులో నిందితుడు అరెస్ట్

Posted On 2026-04-30 09:56:08

Readmore >
Image 1

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత

Posted On 2026-04-29 19:01:13

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష

Posted On 2026-04-29 18:50:39

Readmore >
Image 1

చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్

Posted On 2026-04-29 18:41:17

Readmore >
Image 1

మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

Posted On 2026-04-29 18:39:55

Readmore >
Image 1

పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565

Posted On 2026-04-29 18:37:39

Readmore >
Image 1

ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..

Posted On 2026-04-29 17:26:42

Readmore >
Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >