Posted on 2025-02-07 18:02:55
కొత్తూరు మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన అసెంబ్లీ లో ఆమోదం పొందిన సందర్భంగా సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : కొత్తూరు మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ ,బిసి కుల గణన అసెంబ్లీ లో ఆమోదం పొందిన సందర్భంగా నిర్వహించిన సంబరాల్లో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ...సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కు అనుగుణంగా 30 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని గౌరవించి అన్ని వర్గాలకు సమ న్యాయం అందించడం కోసం కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ ను చేపట్టిందని అన్నారు.ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమ న్యాయం అందించడం దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు.అతి త్వరలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే బాధ్యత తమ పై ఉందని అలాగే అన్ని హామీలను ఒక్కొకటిగా నెరవేరుస్తూన్నామని తెలిపారు.అతి త్వరలో సన్న బియ్యం కూడా ఇవ్వబోతున్నమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, కొత్తూరు మండల అద్యక్షుడు హరినాథ్ రెడ్డి,నందిగామ అధ్యక్షులు జంగా నర్సింహులు,నాయకులు దేవేందర్,జనిగా జగన్,ఎర్రోళ్ల జగన్,సురేందర్,ఎంపీటీసీ కృష్ణా,కుమారస్వామి,దయానంద్,రాయికల, శ్రీనివాస్, శ్రీనాథ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు...
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >