Posted on 2025-02-05 17:40:35
డైలీ భారత్, ఉత్తరప్రదేశ్ డెస్క్:ఆధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. సరిగ్గా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభ మేళాకు ప్రధాని మోదీ హాజరయ్యారు.
ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి అరైల్ ఘాట్కు వెళ్తారు. అరైల్ ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరించారు.
తిరిగి బోటులో ఆ ప్రాంతం నుంచి అరైల్ ఘాట్కు చేరుకున్నారు. ఆ తర్వాత అరైల్ ఘాట్ నుంచి ప్రయా గ్రాజ్ ఎయిర్పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి తిరిగి ఢిల్లీ బయల్దేరుతారు. మోదీ పర్యటన నేపథ్యంలో ప్రయాగ్రాజ్ నగరంతో పాటు కుంభమేళా దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇక జనవరి 13న ప్రారం భమైన మహాకుంభమేళా ఈ నెల 26న మహా శివరా త్రి రోజున ముగియనుంది. ప్రయాగ్రాజ్ మహాకుంభ మేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు త్రివేణి సంగమానికి పోటెత్తారు భక్తులు. ప్రయాగ్రాజ్ ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ఇప్పటి వరకు 38కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సామాన్యులతోపాటు అనేక మంది ప్రముఖులు కూడా ఈ కుంభమేళాకు హాజరవుతున్నారు.
విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి
Posted On 2026-03-11 20:27:35
Readmore >
కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం
Posted On 2026-03-11 20:23:40
Readmore >
కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి
Posted On 2026-03-11 19:25:18
Readmore >