Posted on 2025-02-05 18:32:53
డైలీ భారత్, గుంతకల్:గుంతకల్లు రైల్వే స్టేషన్ యార్డులో సౌత్ క్యాబిన్ వద్ద మంగళవారం రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
జిందాల్ నుండి గూటి వైపు వెళ్తున్న బొగ్గు రవాణా చేసే గూడ్స్ రైలు 13, 14 వ్యాగన్ లు పట్టాలు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
రెండు వ్యాగన్లు పట్టాలు తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు పట్టాలు తప్పిన గూడ్స్ వ్యాగన్ రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు.
ఈ గూడ్స్ వ్యాగన్ పట్టాలు తప్పడంతో ప్రశాంతి ఎక్సప్రెస్ రైలు ను తిమ్మనచెర్ల లో నిలిపివేశారు. అదే విధంగా హుబ్లీ - విజయవాడ అమరావతి ఎక్స్ ప్రెస్ రైలును బైపాస్ మీదుగా మళ్లించారు.
మంగళవారం రాత్రి రావాల్సిన వారణాసి రైలు, గుత్తి, విజయవాడలకు వెళ్లాల్సిన రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గత వారం రోజులకు క్రితం కూడా గుంతకల్ రైల్వే జంక్షన్ లో రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటనపై సంబంధిత రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.
విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి
Posted On 2026-03-11 20:27:35
Readmore >
కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం
Posted On 2026-03-11 20:23:40
Readmore >
కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి
Posted On 2026-03-11 19:25:18
Readmore >