Posted on 2025-02-05 18:32:53
డైలీ భారత్, గుంతకల్:గుంతకల్లు రైల్వే స్టేషన్ యార్డులో సౌత్ క్యాబిన్ వద్ద మంగళవారం రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
జిందాల్ నుండి గూటి వైపు వెళ్తున్న బొగ్గు రవాణా చేసే గూడ్స్ రైలు 13, 14 వ్యాగన్ లు పట్టాలు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
రెండు వ్యాగన్లు పట్టాలు తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు పట్టాలు తప్పిన గూడ్స్ వ్యాగన్ రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు.
ఈ గూడ్స్ వ్యాగన్ పట్టాలు తప్పడంతో ప్రశాంతి ఎక్సప్రెస్ రైలు ను తిమ్మనచెర్ల లో నిలిపివేశారు. అదే విధంగా హుబ్లీ - విజయవాడ అమరావతి ఎక్స్ ప్రెస్ రైలును బైపాస్ మీదుగా మళ్లించారు.
మంగళవారం రాత్రి రావాల్సిన వారణాసి రైలు, గుత్తి, విజయవాడలకు వెళ్లాల్సిన రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గత వారం రోజులకు క్రితం కూడా గుంతకల్ రైల్వే జంక్షన్ లో రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటనపై సంబంధిత రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >
మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-30 22:23:35
Readmore >
నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-05-30 17:55:56
Readmore >
మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం
Posted On 2026-05-30 17:52:53
Readmore >
పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం
Posted On 2026-05-30 17:17:48
Readmore >
మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-05-30 17:15:14
Readmore >