| Daily భారత్
Logo




పూల.రవీందర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

News

Posted on 2025-02-05 17:39:34

Share: Share


పూల.రవీందర్ ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్ ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం.                 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్న మేరకు తమకు అన్యాయం జరిగిందని మాలలు రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు పిల్లి.సుధాకర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు కొప్పరి.నవతన్ అధ్యక్షత వహించగా,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పూల. రవీందర్ మాట్లాడుతూ నిన్న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం పూర్తిగా మాలలను  మోసం చేయడమేనని,కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాపాడుతుందని మాలలు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో అధికారంలోకి తీసుకువస్తే, తమ గొంతే కోస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పని పాట లేనట్టు పిల్లి తలకొరుగుతున్నాడని ఎద్దేవా చేయడం జరిగింది. మాలలు మోసం చేసి అసెంబ్లీలో జన్మ ధన్యమైంది అని చెప్పి మాట్లాడే తెలంగాణ ముఖ్యమంత్రి,ఆయన ఇచ్చిన 420 హామీలను నెరవేర్చి ఆయన జన్మను ధాన్యం చేసుకోవాలి కానీ, ప్రజలను మోసం చేసి,నమ్మిన మాలలు గొంతు కోసి జన్మ ధన్యమైంది అంటే సరికాదని,అది నీ జన్మ దహనమైనట్టు అని,రానున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదయడమే అజెండాగా మాల మహానాడు పనిచేస్తుందని, తెలంగాణలో రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నడవట్లేదని బిజెపి మనువాద పార్టీ మోడీ కనుషన్నల్లో నడిచే బిజెపి ప్రభుత్వం నడుస్తుందని ఇకనైనా రేవంత్ రెడ్డి పందా మార్చుకోకపోతే ,తెలంగాణ లో  రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అధః పాతాళానికి తొక్కిస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పగిడిపల్లి.శ్రీకాంత్, పి.ఎన్.మూర్తి,వాసుమల్ల. గౌతమ్, బద్దం.రాహుల్, దాసరి. అశోక్,పండగ.రాజేశ్వరరావు, గంధం.కల్పన, బద్దం.స్వర్ణలత  తదితర మాల మహా నాయకులు పాల్గొన్నారు.

Image 1

మెడిసిటీ మెగా క్యాంప్, మాజీ పి ఎం పి మిద్దెల యాదమ్మ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ ఏర్పాటు

Posted On 2026-01-16 20:39:04

Readmore >
Image 1

ఉమ్మడి జిల్లాలో విచ్చలవిడిగా వానర సైన్యం స్వైర విహారం

Posted On 2026-01-16 19:08:48

Readmore >
Image 1

ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన 15 మంది నిందితుల అరెస్టు, మరో 9 మంది పరారీ

Posted On 2026-01-16 18:12:26

Readmore >
Image 1

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే జిల్లాకు మొదటి స్థానం

Posted On 2026-01-16 17:40:49

Readmore >
Image 1

ఐద్వా ముగ్గుతో జాతీయ మహాసభల ప్రచారం

Posted On 2026-01-16 16:40:56

Readmore >
Image 1

నిజామాబాద్ జిల్లాలో కొత్త అల్లుడికి 150 వంటకాలతో సంక్రాంతి కనుమ విందు

Posted On 2026-01-16 16:34:26

Readmore >
Image 1

కవితా శీర్షిక కనుమ

Posted On 2026-01-16 11:17:18

Readmore >
Image 1

సంక్రాంతి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే

Posted On 2026-01-15 20:16:20

Readmore >
Image 1

పోలీస్ కమీషనరేట్ పరిధిలో బోధన్ సబ్ డివిజన్ పరిధిలో కోడి పందాలు, జూదం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షణ

Posted On 2026-01-15 20:15:22

Readmore >
Image 1

వలపు వల... దంపతుల ఎర

Posted On 2026-01-15 08:45:32

Readmore >