| Daily భారత్
Logo




పూల.రవీందర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

News

Posted on 2025-02-05 17:39:34

Share: Share


పూల.రవీందర్ ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్ ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం.                 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్న మేరకు తమకు అన్యాయం జరిగిందని మాలలు రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు పిల్లి.సుధాకర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు కొప్పరి.నవతన్ అధ్యక్షత వహించగా,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పూల. రవీందర్ మాట్లాడుతూ నిన్న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం పూర్తిగా మాలలను  మోసం చేయడమేనని,కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాపాడుతుందని మాలలు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో అధికారంలోకి తీసుకువస్తే, తమ గొంతే కోస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పని పాట లేనట్టు పిల్లి తలకొరుగుతున్నాడని ఎద్దేవా చేయడం జరిగింది. మాలలు మోసం చేసి అసెంబ్లీలో జన్మ ధన్యమైంది అని చెప్పి మాట్లాడే తెలంగాణ ముఖ్యమంత్రి,ఆయన ఇచ్చిన 420 హామీలను నెరవేర్చి ఆయన జన్మను ధాన్యం చేసుకోవాలి కానీ, ప్రజలను మోసం చేసి,నమ్మిన మాలలు గొంతు కోసి జన్మ ధన్యమైంది అంటే సరికాదని,అది నీ జన్మ దహనమైనట్టు అని,రానున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదయడమే అజెండాగా మాల మహానాడు పనిచేస్తుందని, తెలంగాణలో రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నడవట్లేదని బిజెపి మనువాద పార్టీ మోడీ కనుషన్నల్లో నడిచే బిజెపి ప్రభుత్వం నడుస్తుందని ఇకనైనా రేవంత్ రెడ్డి పందా మార్చుకోకపోతే ,తెలంగాణ లో  రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అధః పాతాళానికి తొక్కిస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పగిడిపల్లి.శ్రీకాంత్, పి.ఎన్.మూర్తి,వాసుమల్ల. గౌతమ్, బద్దం.రాహుల్, దాసరి. అశోక్,పండగ.రాజేశ్వరరావు, గంధం.కల్పన, బద్దం.స్వర్ణలత  తదితర మాల మహా నాయకులు పాల్గొన్నారు.

Image 1

"క్షణిక ఆనందం - జీవితకాల నష్టం"

Posted On 2026-05-31 11:23:19

Readmore >
Image 1

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు

Posted On 2026-05-30 22:26:06

Readmore >
Image 1

మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-30 22:23:35

Readmore >
Image 1

అమ్మ చరణధూళి బిడ్డలం : మంజుల పత్తిపాటి

Posted On 2026-05-30 17:58:19

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-05-30 17:55:56

Readmore >
Image 1

మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం

Posted On 2026-05-30 17:52:53

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం

Posted On 2026-05-30 17:17:48

Readmore >
Image 1

మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-05-30 17:15:14

Readmore >
Image 1

ఏనుగుల వెంగళరావు కి లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరిన బీసీ సెల్ నాయకులు వెలిశాలరమేష్

Posted On 2026-05-30 17:10:26

Readmore >
Image 1

ఇటీవల మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన గుండ్లరేవు సర్పంచ్ భూక్యా చంద్రబాబు

Posted On 2026-05-30 17:09:29

Readmore >