| Daily భారత్
Logo




పూల.రవీందర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

News

Posted on 2025-02-05 17:39:34

Share: Share


పూల.రవీందర్ ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్ ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం.                 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్న మేరకు తమకు అన్యాయం జరిగిందని మాలలు రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు పిల్లి.సుధాకర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు కొప్పరి.నవతన్ అధ్యక్షత వహించగా,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పూల. రవీందర్ మాట్లాడుతూ నిన్న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం పూర్తిగా మాలలను  మోసం చేయడమేనని,కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాపాడుతుందని మాలలు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో అధికారంలోకి తీసుకువస్తే, తమ గొంతే కోస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పని పాట లేనట్టు పిల్లి తలకొరుగుతున్నాడని ఎద్దేవా చేయడం జరిగింది. మాలలు మోసం చేసి అసెంబ్లీలో జన్మ ధన్యమైంది అని చెప్పి మాట్లాడే తెలంగాణ ముఖ్యమంత్రి,ఆయన ఇచ్చిన 420 హామీలను నెరవేర్చి ఆయన జన్మను ధాన్యం చేసుకోవాలి కానీ, ప్రజలను మోసం చేసి,నమ్మిన మాలలు గొంతు కోసి జన్మ ధన్యమైంది అంటే సరికాదని,అది నీ జన్మ దహనమైనట్టు అని,రానున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదయడమే అజెండాగా మాల మహానాడు పనిచేస్తుందని, తెలంగాణలో రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నడవట్లేదని బిజెపి మనువాద పార్టీ మోడీ కనుషన్నల్లో నడిచే బిజెపి ప్రభుత్వం నడుస్తుందని ఇకనైనా రేవంత్ రెడ్డి పందా మార్చుకోకపోతే ,తెలంగాణ లో  రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అధః పాతాళానికి తొక్కిస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పగిడిపల్లి.శ్రీకాంత్, పి.ఎన్.మూర్తి,వాసుమల్ల. గౌతమ్, బద్దం.రాహుల్, దాసరి. అశోక్,పండగ.రాజేశ్వరరావు, గంధం.కల్పన, బద్దం.స్వర్ణలత  తదితర మాల మహా నాయకులు పాల్గొన్నారు.

Image 1

వాట్సాప్ ద్వారా వైద్య సేవలు.. త్వరలో అందుబాటులోకి!

Posted On 2026-03-12 07:13:00

Readmore >
Image 1

త్వరలో మహిళలకు డిజిటల్ డిజిటల్ హెల్త్ కార్డ్

Posted On 2026-03-12 07:06:57

Readmore >
Image 1

తెలంగాణలో మూడో డిస్కమ్ ఏర్పాటుకు జీవో విడుదల

Posted On 2026-03-12 07:06:09

Readmore >
Image 1

MRO పై అరెస్ట్ వారెంట్ జారీ

Posted On 2026-03-12 07:05:19

Readmore >
Image 1

ప్లాస్టిక్ బాటిళ్లు సేకరించే నెపంతో ఇళ్లలో చోరీలు

Posted On 2026-03-11 22:05:47

Readmore >
Image 1

విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్‌ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి

Posted On 2026-03-11 20:27:35

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం

Posted On 2026-03-11 20:23:40

Readmore >
Image 1

ఆస్తి కోసం కన్నతల్లిని ఇబ్బంది పెడుతున్న కొడుకు

Posted On 2026-03-11 20:19:53

Readmore >
Image 1

కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి

Posted On 2026-03-11 19:25:18

Readmore >
Image 1

తెగిపోయిన చెరువు కట్టను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు

Posted On 2026-03-11 18:51:35

Readmore >