Posted on 2025-02-05 13:39:18
హాస్టల్స్ లోని స్టోర్ రూమ్, కిచెన్ గది క్లీన్ గా ఉండాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
డైలీ భారత్, రాజన్న సిరిసిల్లమహాత్మా జ్యోతి భాపులే విద్యాలయంలోని స్టోర్ రూమ్, కిచెన్ గది నిత్యం క్లీన్ గా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఇప్పలపల్లి వద్ద ఉన్న మహాత్మా జ్యోతి భాపులే విద్యాలయాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా విద్యాలయం ఆవరణ, తరగతి గదులు, వసతి గదులు, స్టోర్ రూం, కిచెన్ పరిశీలించారు.
ఆహార పదార్థాలు నిల్వ చేసే, అలాగే సిద్ధం చేసే గదులు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. అనంతరం 7 వ, 8వ తరగతి సిలబస్ ఎంతమేరకు పూర్తి అయింది ఆరా తీశారు.
అన్ని తరగతుల సిలబస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. అన్ని తరగతుల విద్యార్థులతో నిత్యం ఆయా పాఠ్యాంశాలు చదివించాలని, రాయించాలని పేర్కొన్నారు. పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు 10 జీపీఏ సాధించేలా ప్రణాళిక ప్రకారం సిద్ధం చేయాలని సూచించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
విద్యాలయం ప్రిన్సిపాల్ శ్రీనాథ్, ఉపాద్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >
అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన
Posted On 2025-12-06 15:47:25
Readmore >
ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త
Posted On 2025-12-06 15:33:03
Readmore >
సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి
Posted On 2025-12-06 15:32:07
Readmore >
అన్నాపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోతు రమేష్ స్వామి సాయిరాం తండాలో ఇరుముడి కార్యక్రమం
Posted On 2025-12-06 15:30:17
Readmore >