Posted on 2024-12-30 13:22:18
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు తెలంగాణ అసెంబ్లీ నివాళి అర్పించింది. అనంతరం సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందని తెలిపారు.
రాష్ట్ర ఏర్పాటులో మన్మో హన్ సింగ్ కృషిని కొనియా డారు. ఈతరంలో మన్మో హన్ సింగ్తో పోటీపడేవారే లేరని అన్నారు. ఎవరు, ఎన్ని విమర్శలు చేసినా.. పనినే ధాసగా మన్మోహన్ భావించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత ఆర్థిక సంస్కరణ రూప శిల్పి అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు..
ఉపాధి హామీ సమాచార హక్కు లాంటి చట్టాలు తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్, ది అని రేవంత్ తెలిపారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టింది మన్మోహన్ సింగ్ నాయక త్వమే అన్నారు.మన్మోహన్ సింగ్ కి భారత రత్న ఇవ్వాలని తెలిపారు.
మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో నేను వెళ్లి పరిచయం చేసుకున్నా అన్నారు. మన్మోహన్ సింగ్ సతీమణి…నాకు చెప్పిన మాటలు ఇప్పటికి గుర్తుకొస్తున్నాయన్నారు. ఆమెకు తెలంగాణ అంటే ఎంతో ప్రేమ అని తెలిపారు.
తెలంగాణ లో మన్మోహన్ సింగ్… విగ్రహం ఉండాలని, సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >