Posted on 2024-12-29 19:03:06
డైలీ భారత్, వరంగల్:ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేను అత్యంత పారదర్శకంగా నిర్వహించి నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజినీర్ చాణక్య అన్నారు.
ఆదివారం జిడబ్ల్యూఎంసీ పరిధిలోని కాశిబుగ్గ, తదితర ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఆన్లైన్ లో నమోదు తీరును ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమర్ధ నిర్వహణకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన సర్వే నమోదులో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తప్పులు లేకుండా ఆప్ లో సర్వే వివరాలు నమోదు చేయాలని,సర్వే యాప్లో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు దృష్టి కి తీసుకువచ్చి పరిష్కరించు కోవాలన్నారు. సర్వే పారదర్శకంగా కొనసాగాలని, ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి లబ్ది చేకూర్చాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ రామిరెడ్డి, జిడబ్ల్యూఎంసీ అదనపు కమిషనర్ జోనా, ఉప కమిషనర్లు కృష్ణారెడ్డి, రెవిన్యూ అధికారులు శ్రీనివాస్, శహజాది బేగం, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం
Posted On 2026-07-27 06:58:57
Readmore >
సదాశివనగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు
Posted On 2026-07-26 16:55:36
Readmore >
బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు
Posted On 2026-07-26 16:52:48
Readmore >