Posted on 2024-11-02 04:49:44
మూడున్నరేళ్ల చిన్నారిపై సమీప బంధువైన యువకుడి హత్యాచారం!
శవాన్ని పూడ్చేసి ఏమీ తెలియనట్లు!
అభం శుభం తెలియని మూడున్నరేళ్ల చిన్నారిపై దుర్మార్గుడు కర్కశం
పొలంలోకి తీసుకెళ్లి హత్యాచారం
డైలీ భారత్, తిరుపతి: ఈ మధ్యకాలంలో ఆడ పిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఆడవాళ్లు బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ముక్కుపచ్చలారని చిన్నారులను సైతం కామాంధులు వదిలిపెట్టడం లేదు. తాజాగా మూడున్నరేళ్ల చిన్నారిపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడి, అనంతరం హత్య చేసి ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూడ్చేశాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లా వడమాటపేట మండలంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మండలానికి చెందిన ఓ గ్రామంలో ఓ యువకుడు తన సమీప బంధువైన మూడున్నరేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. ఓ దుకాణం వద్ద తినుబండారాలు కొనిచ్చాడు. అక్కడి నుంచి సమీప పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం బాలికను చంపేసి ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని పూడ్చేశాడు. రాత్రి అవుతున్నా పాప ఇంకా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. అయినా సరే ఆచూకీ లభించకపోవడంతో వడమాలపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే బంధువైన యువకుడిపై అనుమానం వచ్చి పోలీసులు విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొని అతడు ఇచ్చిన సమాచారం మేరకు చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >