Posted on 2024-10-29 15:08:40
అమరుల త్యాగం అజరామరం : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలాల్లో భాగంగా వారిని స్మరిస్తూ జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నేతన్న చౌరస్తా నుండి అంబేద్కర్ మీదుగా గాంధీ చౌరస్తా వరకు క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నిరవాళ్ళు అర్పించిన జిల్లా ఎస్పీ, పోలీస్ యంత్రాంగం.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ......
శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణాలర్చించి పోలీసు అమరవీరులను ప్రజలు మరువద్దని,వారి త్యాగాల ఫలితమే నేడు ప్రశాంత వాతవరణం నెలకొందని,ప్రజా క్షేమం కోసం పని చేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం అమరవీరుల సంస్మరణ వారోత్సవలు నిర్వహిస్తున్నమని అందులో భాగంగా ఈ సంవత్సరం వారిని స్మరిస్తూ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, సైకిల్ ,బైక్ ర్యాలీ,2కె రన్, వ్యాసరచన పోటీలు,షార్ట్ ఫిలిమ్స్,ఓపెన్ హౌస్ కార్యక్రమలు నిర్వహించామన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారి ఆశయ సాధన కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సూచించారు.
ఈ అదనపు ఎస్పీ చంద్రయ్య,సి.ఐ లు కృష్ణ,మొగిలి, వీరప్రసాద్, శ్రీనివాస్, ఆర్.ఐ లు రమేష్, యాదగిరి, ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >