Posted on 2024-10-29 09:04:51
రైతుల గొసను పట్టించుకొని పాలకులు
ధాన్యం కొనుగొలు కేంద్రాలు వెంటనే ప్రారంభం చేయ్యలి అని డిమాండ్ చేస్తున్న బిఆర్ ఎస్ సినియర్ నాయకులు పొచవేని ఎల్లయ్య యాదవ్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఒకటో వార్డు రగుడులో వరి ధాన్యం కోసి 70 శాతం పూర్తయింది కానీ ఇప్పటికి కూడా సకాలంలో తూకం వేయడం లేదు.రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ తూకం వేయకపోవడం వలన రైతులు ప్రైవేట్ గా దళారులకు , రైస్ మిల్లుల ల్లో క్వింటాల్కు 1800 రూపాయల చొప్పున అమ్ముకొని రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు.కావున అధికారులు వెంటనే స్పందించి వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయాలని డిమాండ్ చేస్తున్న పొచవేని ఎల్లయ్య యాదవ్
ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ లేదు, రైతుబంధు లేదు, రైతు బీమా లేదు సాగునూరు లేదు రైతులకు ఇచ్చిన మాట ఏదీ నెరవేర్చని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎండగడుతునే ఉంటాం.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గత పది సంవత్సరాల్లో దీపావళికి ముందే వడ్ల కొనుగొలు కేంద్రం ప్రతి గ్రామంలో ప్రారంభించినాడు. రైస్ మిల్ అలాట్మెంట్ చేయడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల బాధ పట్టించుకోవడం లేదు ఇప్పటి వరకు తూకాలకు పంపించడం లేదు రైస్ మిల్లలకు అలామ్మేంట్ ఇవ్వడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే ఇంత చులకన ఎద్దు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు ఈ చరిత్రలో ఎప్పుడు లేదు రేవంత్ రెడ్డికి రైతులు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తారు వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారభం చేసేదాకా రైతుల పక్షాన నిలబడి రైతులకు అండగా ఉంటాం
ఇట్టి కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు బూర తిరుపతి బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు బూర కమలాకర్, మాస అనిల్, మాసరాములు, స్వామి,మదు, సిరిసిల్ల లింగం,ఏశ నాగరాజు రైతులు తదితరులు పాల్గొన్నారు
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >