Posted on 2024-10-25 19:33:40
డైలీ భారత్, నరసింహులపేట: ఈరోజు TPTF నరసింహులపేట మండల శాఖ సమావేశం స్థానిక మండల కేంద్రంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ నరసింహులపేట మండల అధ్యక్షులు వై క్రాంతి కుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో TPTF మండల అధ్యక్షుడు వై క్రాంతి కుమార్ మాట్లాడుతూ మన మండలంలో MEO డిప్యూటేషన్ ల గురించి వివిధ ఉపాధ్యాయ సంఘాలతో తేదీ 22-10-2024 నాడు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఉన్న తరగతుల కంటే అదనంగా ఉపాధ్యాయులు ఉన్న పాఠశాల నుండి ఉపాధ్యాయులు అవసరం ఉన్న పాఠశాలలకు, ఏకోపాద్యాయ పాఠశాలల కు కేటాయించామని కోరినప్పటికీ పట్టించుకోకుండా విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా కాకుండా కొంతమంది ఉపాధ్యాయుల కోరిక మేరకు డిప్యూటేషన్లకు సంబంధించిన ప్రపోజల్స్ ను తయారుచేసి DEO కార్యాలయానికి పంపడం జరిగింది. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు సూచనలు చేసినప్పటికిని వాటిని పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించడం జరిగింది.
కావున DEO కార్యాలయానికి పంపిన డిప్యూటేషన్ అభ్యర్థనలను పున సమీక్షించాలని కోరడం జరిగింది.ఈ సమావేశం లో ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్,యాకన్న ,నరసింహరావు,బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని కొట్టిపారేసిన దక్షిణ మధ్య రైల్వే
Posted On 2026-04-20 07:46:07
Readmore >
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >