డైలీ భారత్, నెల్లికుదురు /మహబూబాబాద్: నెల్లి కుదురు మండల కేంద్రము లో ని తెలంగాణ మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ స్కూల్ మరియు ఎర్రబెల్లిగూడెం అంగన్వాడి స్కూల్స్, ప్రాథమికోన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారి, జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మెరుగైన ఫలితాలు కోసం నిరంతరం మంచి విద్య ను అందించాలని టీచర్లు కు సూచించారు. చుట్టూ పరిసరాలు పరిశుభ్రతని నిర్వహించాలని, వేడి వేడి భోజనం విద్యార్థులకు అందించాలని, విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్నారు.