Posted on 2024-09-11 17:56:52
నిమజ్జన కార్యక్రమంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బొబ్బిలి, పెరుమళ్ల చెరువు వద్ద నిమర్జనానికి అన్ని ఏర్పాట్లు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సూచించారు. మున్సిపాలిటీలోని బొబ్బిలి చెరువు వద్ద నిమర్జన ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, కౌన్సిలర్ బచ్చలి నర్సింహా, నాయకులు చెట్ల నర్సింహా, శేఖర్, శ్రీశైలం, రవి, అధికారులతో కలిసి పరిశీలించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బొబ్బిలి, పెరుమళ్ల చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిమర్జనం కోసం క్రేన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, భక్తులు ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చెరువుల వద్ద అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని వివరించారు. గణేష్ నిమర్జనం కార్యక్రమంలో తగిన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని, నిమర్జనం కార్యక్రమంలో ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >