Posted on 2024-09-11 14:26:52
నిమజ్జన కార్యక్రమంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బొబ్బిలి, పెరుమళ్ల చెరువు వద్ద నిమర్జనానికి అన్ని ఏర్పాట్లు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సూచించారు. మున్సిపాలిటీలోని బొబ్బిలి చెరువు వద్ద నిమర్జన ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, కౌన్సిలర్ బచ్చలి నర్సింహా, నాయకులు చెట్ల నర్సింహా, శేఖర్, శ్రీశైలం, రవి, అధికారులతో కలిసి పరిశీలించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బొబ్బిలి, పెరుమళ్ల చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిమర్జనం కోసం క్రేన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, భక్తులు ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చెరువుల వద్ద అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని వివరించారు. గణేష్ నిమర్జనం కార్యక్రమంలో తగిన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని, నిమర్జనం కార్యక్రమంలో ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు.
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >