Posted on 2024-09-11 15:16:00
బడంగ్ పేట కార్పొరేషన్ 28వ డివిజన్ లో వినాయకుడికి పూజ
నిమజ్జనాల్లో జాగ్రత్తలు పాటించాలి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: వినాయక నిమజ్జనాల్లో పోలీసు శాఖ నియమ నిబంధనలు పాటించాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇవాళ బడంగ్ పేట కార్పొరేషన్ 28వ డివిజన్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బంగారి అశోక్ ఏర్పాటు చేసిన చవితి ఉత్సవాలు అన్నదాన కార్యక్రమంలో కేఎల్ఆర్ పాల్గొన్నారు.
ఈసందర్భంగా కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... నవరాత్రి ఉత్సవాల పూజలతో యావత్ దేశంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందన్నారు. అనంతరం గోశాలలో ఉన్న గోమాతకు పూజ చేశారు. మద్యం సేవించి, మత్తు పదార్థాలతో నిమజ్జనాలకు రావొద్దన్న పోలీస్ నిబంధనలు పాటించాలని కేఎల్ఆర్ కోరారు.
ఈకార్యక్రమంలో బడంగ్ పేట కార్పొరేషన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >