Posted on 2024-09-10 15:30:00
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలో సర్దార్ నగర్ లోని శ్రీ హిందూ వాహిని సర్దార్ యూత్ అసోసియేషన్ 26వ వార్షికోత్సవం పురస్కరించుకుని గణపతి పూజ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నవి.
ఇట్టి గణపతి ప్రతిష్టకు సహకరించిన స్థానిక 29వ వార్డ్ కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్ మరియు విగ్రహ దాత చొప్పదండి హరీష్ - కల్యాణి కి సంఘ అధ్యక్షులు కొట్టే రాజు పటేల్, కోశాధికారి భరత్ కీర్నే మరియు సంఘ సభ్యులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపినారు.
గత 25 సంవత్సరాల నుండి మండపం వద్ద సత్యనారాయణ వ్రతం, కుంకుమ పూజ మరియు అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా పూజలు అందుకుంటున్న ఈ విజ్ఞేశ్వరుడిని భక్తులందరూ దర్శించుకొని స్వామి వారి కృపకి పాత్రులు కాగలరని మనవి.
ఇట్లు
శ్రీ హిందూవాహిని సర్దార్ యూత్ అసోసియేషన్
సర్దార్ నగర్, సిరిసిల్లా
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >