Posted on 2024-09-10 09:20:04
అకాల వర్షాలతో సర్వం కోల్పోయి నిరాసులైన 270 కుటుంబాలకు చేయూత.
ప్రభుత్వం ఆదుకునే వరకు ప్రజలకు అండగా ఉండి పోరాడుతాం..
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం నగరంలో ఇటీవలే కురిసిన భారీ వర్షాలతో సర్వం కోల్పోయి నిరాసులైన వివిధ కుటుంబాలను ఆదుకోవాలని ఖమ్మం నగర BRS పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో కార్పొరేషన్ పరిధిలోని 46,30,04,17,34 డివిజన్ ల పరిధిలో 270 మంది కుటుంబాలకు సుమారు (2,30,000) 2లక్షల 30 వేల రూపాయల విలువచేసే నిత్యవసరాల కిట్లను వరద బాధితులకు స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలుతో కలిసి నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు అందజేశారు.
మానవత కోణంలో ప్రభుత్వం స్పందించక ముందే మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ సహకారంతో బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇప్పటికే మున్నేరు వరద బాధితులకు 10 వేల మందికి నిత్యవసర సరుకులు అందించినట్లు గుర్తు చేశారు. నేడు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపుమేరకు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని నిరాసులైన 270 మందికి వరద బాధితులకు దాదాపు10 రోజు సరిపడా నిత్యవసర సరుకులను వారి స్వతహాగా పగడాల నాగరాజు కూరాకుల నాగభూషణం అందించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముక్కాల కమల.కన్నం వైష్ణవి ప్రసన్న.దండ జ్యోతి రెడ్డినగర పార్టి ప్రచార కార్యథర్శి షేక్ షకినా, 21వ డివిజన్ ఇన్ చార్జి షేక్ ఉస్మాన్ .కోడి లింగయ్య .బొల్లేపల్లి విజయ్ సారిక రాము .మధు.మేడిదెల మల్లేష్.ఎడెల్లి బిక్షం.సుబ్బా చారి .... తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >