Posted on 2024-09-09 16:31:33
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం చించోడు గ్రామంలోని బ్రహ్మ చెరువు అలుగు నిండిన సందర్భంగా సోమవారం షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. అలుగు దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
భారీగా కురుస్తున్న వర్షాలతో పల్లెలకు జలకల వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. తనను గ్రామానికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేయించినందుకు కార్యకర్తలకు గ్రామస్తులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు అనంతం, దామోదర్, డిప్యూటీ సర్పంచ్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు గోపాల్ నాయక్, గూడెం జంగయ్య ,సర్దార్, సిరా అంజయ్య ,కాజా పాషా, ప్రసాద్,రామగుల్ల రాజు, గణేష్, సంతు నాయక్, జాంగిర్ సలీం ,శ్రీనివాస్ శర్మ పంతులు, టైలర్ వెంకటేష్,సర్దార్,ఖాదర్ తదితరులు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >