Posted on 2024-09-09 13:40:53
చించోడు బ్రహ్మ చెరువు అలుగు నిండిన సంధర్భంగా గ్రామస్తులతో పూజలు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గతంలో నెర్రబాలిన నెలలు.. నిండని చెరువులతో మోడుబారిన పల్లెలు.. నేడు గలగల పారేటి గంగమ్మ తల్లితో.. చిగురించాయి మన పల్లెలు అంటూ షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" చించోడు గ్రామస్తులతో కలిసి ఆనందం వ్యక్తం చేశారు. ఫరూక్ నగర్ మండలం చించోడు బ్రహ్మ చెరువు అలుగు నిండిన సందర్భంగా సోమవారం షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ చించోడు విచ్చేయడం జరిగింది. అలుగు దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించి చెరువు కాపలాదారులు నీరటి వారిని ఘనంగా సన్మానించారు. చెరువుకపలాదారులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో గుర్తింపు అందిస్తామని హామీ ఇచ్చారు.
భారీగా కురుస్తున్న వర్షాలతో పల్లెలకు జలకల వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. తనను గ్రామానికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేయించినందుకు కార్యకర్తలకు గ్రామస్తులకుఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చించోడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అజ్మత్ బాబా అలీ,అనంతం, అక్కిగారి శ్రీధర్, మాజీ సర్పంచ్ రేకల శ్రీనివాస్, ఎల్లప్ప, శ్రీధర్ రెడ్డి, జమాల్పూర్ రాజు, హాజీ పాషా వివిధ గ్రామ పంచాయతీలకు సంబంధించిన నాయకులు తదితరులు పాల్గొన్నారు..
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >