Posted on 2024-09-09 10:10:53
చించోడు బ్రహ్మ చెరువు అలుగు నిండిన సంధర్భంగా గ్రామస్తులతో పూజలు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గతంలో నెర్రబాలిన నెలలు.. నిండని చెరువులతో మోడుబారిన పల్లెలు.. నేడు గలగల పారేటి గంగమ్మ తల్లితో.. చిగురించాయి మన పల్లెలు అంటూ షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" చించోడు గ్రామస్తులతో కలిసి ఆనందం వ్యక్తం చేశారు. ఫరూక్ నగర్ మండలం చించోడు బ్రహ్మ చెరువు అలుగు నిండిన సందర్భంగా సోమవారం షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ చించోడు విచ్చేయడం జరిగింది. అలుగు దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించి చెరువు కాపలాదారులు నీరటి వారిని ఘనంగా సన్మానించారు. చెరువుకపలాదారులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో గుర్తింపు అందిస్తామని హామీ ఇచ్చారు.
భారీగా కురుస్తున్న వర్షాలతో పల్లెలకు జలకల వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. తనను గ్రామానికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేయించినందుకు కార్యకర్తలకు గ్రామస్తులకుఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చించోడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అజ్మత్ బాబా అలీ,అనంతం, అక్కిగారి శ్రీధర్, మాజీ సర్పంచ్ రేకల శ్రీనివాస్, ఎల్లప్ప, శ్రీధర్ రెడ్డి, జమాల్పూర్ రాజు, హాజీ పాషా వివిధ గ్రామ పంచాయతీలకు సంబంధించిన నాయకులు తదితరులు పాల్గొన్నారు..
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >