Posted on 2024-09-08 11:33:02
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తమిళ నటుడు విజయ్కు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. విజయ్ రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగంను ఎన్నికల సంఘం అధికారికంగా గుర్తించింది.ఈ మేరకు తమిళగ వెట్రి కళగం పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. తమిళగ వెట్రి కళగం పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపుపై ఆ పార్టీ అధినేత విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. తమ రాజకీయ పార్టీ చట్టపరమైన నమోదు కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నామని.. అయితే ఇప్పుడు ఈసీ నుంచి గుర్తింపు లభించిందని చెప్పారు. అయితే రాజకీయ పార్టీ గుర్తింపు కోసం తమిళగ వెట్రి కళగం ఈసీకి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే దరఖాస్తు చేయగా.. దాదాపు 7 నెలల తర్వాత గుర్తింపు లభించింది.
'తమిళగ వెట్రి కజగంను రాజకీయ పార్టీగా నమోదు చేయాలని మేము గత ఫిబ్రవరి 2వ తేదీన భారత ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నాము. మన దేశ ఎన్నికల సంఘం దీనిని చట్టబద్ధంగా పరిగణించి ఇప్పుడు మన పార్టీని రాజకీయ పార్టీగా నమోదు చేసి, రిజిస్టర్డ్ పార్టీగా ఎన్నికల రాజకీయాలలో పాల్గొనేందుకుఅనుమతించింది. దీన్ని మీకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని విజయ్ చెప్పారు.
దీంతో తమకు మొదటి తలుపు తెరుచుకుందని విజయ్ అన్నారు. తమ పార్టీ మొదటి రాష్ట్ర స్థాయి సమావేశానికి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయని.. త్వరలోనే ఇందుకు సంబంధించి ప్రకటన ఉంటుందని విజయ్ తెలిపారు.
ఇక, విజయ్ గత నెలలో తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం జెండాను, గుర్తును ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. విజయ్ పనైయూర్లోని పార్టీ కార్యాలయంలో జెండాను ఎగురవేసి.. తన పార్టీకి సంబంధించిన అధికారిక పాటను కూడా విడుదల చేశారు. రెండు రంగులు మెరూన్, పసుపుతో కూడిన జెండాలో రెండు వైపులా ఏనుగులు, మధ్యలో దిరిసెన పువ్వు గుర్తును ఉంచారు.
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >