Posted on 2023-11-08 18:26:28
మోసపూరిత బీఆరెస్ ప్రభుత్వాన్ని ఓడిద్దాం కాంగ్రెస్ నేత కెకె మహేందర్ రెడ్డి
డైలీ భారత్, సిరిసిల్ల: మోసపూరిత బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి అన్నారు సిరిసిల్లలోని
తంగాళ్ళపల్లి మండల అధ్యక్షులు ప్రవీణ్ టోనీ అద్వర్యం లో పలువురు వివిధ పార్టీల నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు అనంతరం కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ
దశాబ్ద కాలంగా అనేక హామీలు ఇచ్చి నిరుపేదల సంక్షేమాన్ని మరచి ఏ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా మోసపూరితంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికలలో పారదోలాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నన్ను గెలిపించాలని ఆయన కోరారు కాంగ్రెస్ పార్టీలో మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షురాలు లింగం రాణి తంగాళ్ళపల్లి రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు గంగ రాజీ రెడ్డి, నేరెళ్ల బిఎస్పి అధ్యక్షులు ఆనంద్ ఆధ్వర్యంలో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేకే మహేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్,భూపతి,సుద్దాల శ్రీనివాస్,లక్ష్మీరాజం,శ్రీకాంత్. మునిగ రాజు. భారత్.పరశురాములు.హారిక,సరిత,భాగ్య, శంకర్,లక్ష్మణ్,,
యూత్ కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >