Posted on 2023-11-08 06:47:53
డైలీ భారత్, (రంగారెడ్డి): తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనేక మంది మంది నామినేషన్ వేశారు ప్రచారంలో నిమగ్నమయ్యారు అయితే ప్రస్తుతం ఒక వ్యక్తి కోసం మనం తెలుసుకోవాలి. 16 ఏళ్ల వయసులోనే కార్మికుడిగా తన జీవితాన్ని ప్రారంభించి 22 సంవత్సరాలు వయసులో నే ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రెటరీగా కార్మిక జాతికి సేవలందించారు. ఆ తర్వాత కార్మిక హక్కుల కోసం ఉద్యమించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా అనేక ప్రాంతాల్లో కార్మిక హక్కుల ఉద్యమ నేతగా ఎదిగారు. తెలంగాణ ప్రభుత్వం అతని సేవలను పరిశీలించి తెలంగాణ ఢిల్లీ అధికార ప్రతినిధి మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి చేతుల మీదుగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు రవీంద్ర భారతి లో అందించారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ బీసీ కమిషనర్ చేతుల మీదుగా ధైర్య సాహసాలకు గరుడ కీర్తి రత్న అవార్డును అందించారు. ఆ తర్వాత రాజకీయ విశ్లేషణలో తిరుగు లేని రాజకీయ విశ్లేసుడిగా ఎదిగారు. ఎక్కడ ఏ ప్రజా సమస్య కనిపించిన తనదైన శైలిలో ప్రశ్నించడం అతను జీవన శైలిలో ఒక భాగం. ఆడారి నాగరాజు కి కులం మతం ప్రాంతాలకు అతీతంగా శ్రేయోభిలాషులు ఉండడం అందులోనూ ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఎంప్లాయిస్ మరియు అన్ని రాజకీయ పార్టీలోనూ అతని శ్రేయోభిలాషులు ఉండడం
అతని వ్యక్తిత్వానికి నిదర్శనం. గిరిజన సంఘాలు కార్మిక సంఘాలు బీసీ సంఘాలు ఆడారి నాగరాజు రాజకీయాల్లోకి రావాలని ఎప్పటినుంచో ఒత్తిడి తీసుకురావడం గమనార్ధం. ఏది ఏమైనా ఆడారి నాగరాజు లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ వ్యవస్థను మార్పు దిశగా తీసుకువెళ్తారని ఆశిద్దాం
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >