Posted on 2023-11-08 08:04:11
TTU జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి
డైలీ భారత్, సిరిసిల్ల: నవంబర్ 30న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల విధులు నిర్వహించుచున్న ఉద్యోగ,ఉపాధ్యాయులకు మరుసటి రోజు డిసెంబర్ 1వ తేదీన సెలవు ప్రకటించాలని తెలంగాణ టీచర్స్ యూనియన్(TTU) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి ఒక ప్రకటనలో డిమాండ్ చేసారు. ఈ సందర్బంగా రవి మాట్లాడుతూ ఉద్యోగ,ఉపాధ్యాయులు నవంబర్ 29,30 తేదీల్లో ఎన్నికల విధులు నిర్వహించే నేపద్యంలో మానసిక, శారీరక అలసటకు గురి అవుతారని, ఎన్నికల విధులలో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు అందరికి డిసెంబర్ ఒకటవ తేదీన సెలవు ప్రకటించాల్సిన అవసరంవుందని అన్నారు. ఉద్యోగులు 30వ తేదీ న రాత్రి 1,2గంటలకు ఇంటికి చేరే పరిస్థితి దరిమిలా తెల్లారి డ్యూటీ చేయడం కష్టతరం అవుతుందని అన్నారు. ఎన్నికల విధులు ఎంతో బాధ్యత యుతంగా నిర్వహించాల్సి ఉంటుందని అన్ని రకాల మౌలిక సదుపాయలు కల్పించాలని, రెమ్యూనేషన్ సకాలంలో అందించాలని కోరారు..త్రాగు నీరు, భోజనాలు తదితర సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తడుకల సురేష్ లు పాల్గొన్నారు
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >