Posted on 2024-08-31 19:11:05
డైలీ భారత్, ఖమ్మం: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపినందున భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు గారు సూచించారు.
మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు అని తెలిపారు
గ్రామాలలో పాత ఇండ్లు,గుడిసెలు, శిథిలావస్థలో ఉండే నివాసలలో ఉండే ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని, గ్రామాలలో పెద్దలు తమ పిల్లలను,వాగుల వద్దకి వెళ్లకుండా చూడాలని, వాగులు వంకలలో కూడా నీటి ప్రవాహాలు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలలో అప్రమతంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి,గోరువెచ్చనినీటిని తాగండి, నిల్వ ఉంచిన నీటిని ఉపయోగించకండి అని తెలిపారు
సీజన్ వ్యాధులు సోకకుండా చూసుకోండి...
ముఖ్యంగా రైతులు వ్యవసాయ క్షేత్రంలో పనులకు వెళ్ళినప్పుడు విష సర్పాలు తో జాగ్రత్త ఉండాలని, కాలనీలలో కరెంటు స్తంభాలను తాకవద్దు అని తెలిపారు...
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం
Posted On 2026-05-25 15:10:05
Readmore >
అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 10:43:55
Readmore >
తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం
Posted On 2026-05-24 21:12:46
Readmore >
ఈత సరదా విషాదంగా మారకుండ జాగ్రత్తపడుదాం : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
Posted On 2026-05-24 12:27:09
Readmore >