Posted on 2024-08-12 07:00:49
డైలీ భారత్, ఖమ్మం: మొబైల్ మాయలో పడి ఏం చేస్తున్నాం అన్న సంగతి కూడా కొందరు మరిచిపోతారు. ప్రస్తుతం ఒక ఘటన కూడా ఇలాంటిదే. ఖమ్మం జిల్లా కేంద్రంలోని స్థానిక కాల్వ ఒడ్డునున్న హనుమాన్ గుడి సమీపంలో దోనెపూడి మహేశ్ బాబు కుటుంబంతో నివసిస్తున్నాడు. వేడినీళ్ల కోసం హీటర్ ఆన్ చేయాలనుకొన్నాడు.
ఇంతలో మహేశ్ మొబైల్ రింగ్ అయ్యింది. దీంతో ఒక వైపు ఫోన్ లో మాట్లాడుతున్న మహేశ్ బకెట్ నీటిలో బదులు హీటర్ ను తన చంకలో పెట్టుకున్నాడు. తానేం చేస్తున్నానో మరిచిపోయి హీటర్ స్విచ్ ఆన్ చేశారు. దీంతో విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. దీంతో భయపడిపోయిన భార్య దుర్గాదేవి.. మహేశ్ ను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావును ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించనున్న పోలీసులు
Posted On 2025-05-22 05:22:13
Readmore >దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి: జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2025-05-21 17:29:16
Readmore >చౌదరిపల్లి 176 ఎకరాల లావుణి, అసైన్డ్ భూముల స్కాంపై విచారణకు ఆదేశించిన కలెక్టర్
Posted On 2025-05-20 07:24:46
Readmore >