| Daily భారత్
Logo




గరుడ పంచమి మహిమాన్వితమైనది : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-08-09 15:30:20

Share: Share


గరుడ పంచమి మహిమాన్వితమైనది : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

గరుడ పంచమి పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు తదితరులు ఆధ్వర్యంలో ఘనంగా గరుడ పంచమి

పెద్ద ఎత్తున హాజరైన మున్సిపల్ చైర్మన్ నరేందర్, కమిషనర్ వెంకన్న, భక్తులు, ప్రముఖులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గరుడ పంచమి ఎంతో మహిమాన్విత్వమైనదని హిందూ సంస్కృతి సంప్రదాయాలలో గరుడ పంచమికి ప్రత్యేక విశిష్ట స్థానం ఉందని ఈ పూజలు నిర్వహించిన వారు ఎంతో బలవంతులవుతారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిలు అన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే ఆలయ నిర్వాహకులు భక్తులు మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన గరుడ పంచమి కార్యక్రమానికి ప్రముఖులు, మున్సిపల్ చైర్మన్ నరేందర్ కమిషనర్ చీమ వెంకన్న, భక్తులు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న గరుడ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, బక్కని నరసింహులు, ప్రతాప్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో  స్వామీ భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిర్వహించిన గరుడ వాహనసేవలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. మహిమాణిత్వమైన గరుడ పంచమి గురించి పలువురు వివరిస్తూ.. కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించిగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. అందువల్ల సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి నాగ పంచమిగా పిలవబడుతోంది. ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక శ్రావణ శుద్ధ పంచమిని గరుడు పంచమిగా కూడా వ్యవహరిస్తున్నాం. అదీగాక ఆయన తన తల్లి వినత దాస్య విముక్తి కోసం ఆయన కనబర్చిన ధైర్యసాహాసాల రీత్యా ఈ పర్యదినానికి ఆయనకి కూడా ప్రాముఖ్యత ఏర్పడింది. కావున శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమని నాగపంచమిగానూ, గరుడ పంచమిగానూ వ్యవహరిస్తున్నాం అనీ కేవలం శ్రావణంలో వచ్చే పంచమికి మాత్రం నాగేంద్రుడి తోపాటు గరుత్మంతునికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నాం అని భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ నరేందర్, మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు విశ్వం, మాజీ జెడ్పిటిసి పి. వెంకటరామిరెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఒగ్గుకిషోర్, టిడిపి నేత కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేతలు కట్ట వెంకటేష్ గౌడ్, తోకల దామోదర్ రెడ్డి, జంగారెడ్డి రవి తదితరులు పాల్గొన్నారు..

Image 1

ఏసీబికి చిక్కిన సీనియర్ అకౌంటెంట్

Posted On 2026-03-13 08:19:15

Readmore >
Image 1

బార్ కౌన్సిల్ కు ఎన్నికైన మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు

Posted On 2026-03-13 08:09:52

Readmore >
Image 1

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం : జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి

Posted On 2026-03-13 08:09:02

Readmore >
Image 1

ప్రభుత్వ వైద్య సేవలపై వివరించాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-03-12 22:25:21

Readmore >
Image 1

దేశంలో ఎల్పిజి కొరతపై కేంద్రం సంచలన ప్రకటన చేసింది

Posted On 2026-03-12 21:54:50

Readmore >
Image 1

హైదరాబాద్‌లో పారిశుధ్య సమస్యలను నివేదించడానికి వాట్సాప్ సౌకర్యం ప్రవేశపెట్టబడింది

Posted On 2026-03-12 21:53:55

Readmore >
Image 1

శుక్రవారం నాడు అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు బేబీ కిట్స్ పంపిణీ కార్యక్రమం

Posted On 2026-03-12 21:52:35

Readmore >
Image 1

వరంగల్: అంతర్ జిల్లా కరెంట్ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్

Posted On 2026-03-12 19:38:16

Readmore >
Image 1

కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి : కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

Posted On 2026-03-12 18:49:30

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా గురువారం పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-03-12 18:47:14

Readmore >