Posted on 2024-08-08 11:28:41
శోభనం గదిలో నవ వధువు మృతి..
డైలీ భారత్, కేరళ: పెళ్లైన తొలి రాత్రి రోజే వధువు మృతిచెందిన షాకింగ్ ఘటన కర్ణాటకలోని కోలార్లో చోటుచేసుకుంది. చంబరసనహళ్లి ప్రాంతానికి చెందిన నవీన్, లిఖితలకు నిన్న వివాహం జరిగింది.
ఆ తర్వాత లిఖిత తన భర్తతో కలిసి అత్తింటికి వెళ్లింది. అదే రోజున శోభన ఏర్పాట్లు చేసారు. లిఖిత, నవీన్ గదిలోకి వెళ్లాక కేకలు, అరుపులు వినిపించాయి. దాంతో ఏమైందా అని నవీన్ తల్లిదండ్రులు తలుపులు తట్టినా వారు తెరవలేదు. ఓ అరగంట తర్వాత నవీన్ తలుపులు తీసాడు. లోపలికి వెళ్లి చూడగా.. లిఖిత రక్తపుమడుగుల్లో పడి ఉండటం చూసి వారు షాకయ్యారు.
నవీన్కు కూడా బాగా గాయాలయ్యాయి. దాంతో ఇద్దరినీ దగ్గర్లోని హాస్పిటల్కు తరలించగా లిఖిత అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. నవీన్ పరిస్థితి విషమంగా ఉంది. ఆ తర్వాత పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. నవీన్ శోభన గదిలోకి వెళ్లే ముందు తాగి వెళ్లాడని ఆ సమయంలో వారి మధ్య గొడవ చోటుచేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నవీన్ స్పృహలోకి వస్తే తప్ప ఏం జరిగిందో తెలుసుకోలేమని వారు పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >