Posted on 2024-08-08 11:28:41
శోభనం గదిలో నవ వధువు మృతి..
డైలీ భారత్, కేరళ: పెళ్లైన తొలి రాత్రి రోజే వధువు మృతిచెందిన షాకింగ్ ఘటన కర్ణాటకలోని కోలార్లో చోటుచేసుకుంది. చంబరసనహళ్లి ప్రాంతానికి చెందిన నవీన్, లిఖితలకు నిన్న వివాహం జరిగింది.
ఆ తర్వాత లిఖిత తన భర్తతో కలిసి అత్తింటికి వెళ్లింది. అదే రోజున శోభన ఏర్పాట్లు చేసారు. లిఖిత, నవీన్ గదిలోకి వెళ్లాక కేకలు, అరుపులు వినిపించాయి. దాంతో ఏమైందా అని నవీన్ తల్లిదండ్రులు తలుపులు తట్టినా వారు తెరవలేదు. ఓ అరగంట తర్వాత నవీన్ తలుపులు తీసాడు. లోపలికి వెళ్లి చూడగా.. లిఖిత రక్తపుమడుగుల్లో పడి ఉండటం చూసి వారు షాకయ్యారు.
నవీన్కు కూడా బాగా గాయాలయ్యాయి. దాంతో ఇద్దరినీ దగ్గర్లోని హాస్పిటల్కు తరలించగా లిఖిత అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. నవీన్ పరిస్థితి విషమంగా ఉంది. ఆ తర్వాత పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. నవీన్ శోభన గదిలోకి వెళ్లే ముందు తాగి వెళ్లాడని ఆ సమయంలో వారి మధ్య గొడవ చోటుచేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నవీన్ స్పృహలోకి వస్తే తప్ప ఏం జరిగిందో తెలుసుకోలేమని వారు పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!
Posted On 2026-03-13 17:33:46
Readmore >
కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు
Posted On 2026-03-13 16:46:49
Readmore >
అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-13 16:41:37
Readmore >
అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్
Posted On 2026-03-13 16:39:38
Readmore >