Posted on 2023-11-01 12:53:11
హిందూ సాంస్కృతిక సమితి అధ్యక్షుడు పత్తిపాక సురేష్
డైలీ భారత్, సిరిసిల్ల :నవంబర్ రెండు గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని లహరి ఫంక్షన్ హాల్ లో నిర్వహించబోతున్న పద్మశాలీల ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలని హిందూ సాంస్కృతిక సమితి అధ్యక్షుడు పత్తిపాక సురేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్ లో బుదవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సురేష్ మాట్లాడుతూ కోరుట్లలో నిర్వహించిన పద్మశాలి ఆత్మగౌరవ సభకు లక్ష మందికిపైగా హాజరై విజయవంతం చేశారని గుర్తు చేశారు. గడిచిన 70 సంవత్సరాల నుంచి సిరిసిల్లలో నాయకత్వం మార్పు జరగలేదని, రాజకీయ మార్పు కోసం తాను ముందుకు వస్తున్నట్లు తెలిపారు. గురువారం జరగబోయే పద్మశాలీల ఆత్మగౌరవ సభకు పార్టీల కతీతంగా అధిక సంఖ్యలో పద్మశాలీలు పాల్గొని తనను ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust
Posted On 2026-08-15 17:50:48
Readmore >
గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్కు డిజిటల్ పరికరాలు
Posted On 2026-08-15 17:49:14
Readmore >
విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-08-15 16:55:47
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 13:43:20
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >
ఆటో కార్మికులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-08-15 07:33:17
Readmore >