Posted on 2024-07-22 17:55:50
ఢిల్లీలో ఓ బస్సు బీభత్సం మెట్రో పిల్లర్ను ఢీకొన్న ఎలక్ట్రిక్ బస్సు.. ఒకరు మృతి.
డైలీ భారత్, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. ఎలక్ట్రిక్ బస్సు మెట్రో పిల్లర్ను ఢీకొట్టడంతో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా.. మరో 24 మందికి గాయాలయ్యాయి. ఢిల్లీలోని పంజాబీ బాగ్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
పంజాబీ బాగ్లోని రోహ్తక్ రోడ్డులోని శివాజీ పార్క్ సమీపంలో ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మెట్రో పిల్లర్ను ఎలక్ట్రిక్ బస్సు ఢీకొనడంతో 45 ఏళ్ల మహిళ మృతి చెందగా, మరో 24 మంది ప్రయాణికులు గాయపడ్డారని వెల్లడించారు. బస్సు ప్రమాదానికి సంబంధించి ఉదయం 7.42 గంటలకు పంజాబీ బాగ్ పోలీస్ స్టేషన్కు పీసీఆర్ కాల్ వచ్చిందని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ విచిత్ర వీర్ తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు మంగోల్పురి-ఆనంద్ విహార్ మధ్య నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సు ఆ ప్రాంతంలోని మెట్రో పిల్లర్పైకి దూసుకెళ్లినట్లు గుర్తించారు. బస్సు డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి ఆటో రిక్షా ఢీకొట్టింది.
ప్రమాదంలో మహిళ మృతి చెందగా, 55 ఏళ్ల వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన 24 మంది ప్రయాణికుల్లో 14 మందిని మహారాజా అగ్రసేన్ ఆసుపత్రికి, మరో 10 మందిని ఆచార్య భిక్షు ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
నిర్లక్ష్యంతో ర్యాష్ డ్రైవింగ్, ఒకరి మరణానికి కారణమైనందుకు భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేశామని, క్రైమ్ టీమ్ను సంఘటనా స్థలానికి పిలిపించి, ఫోరెన్సిక్ శాంపిల్స్ తీసుకుంటున్నామని పోలీసు అధికారి తెలిపారు. బస్సులో మెకానికల్ తనిఖీలు కూడా జరుగుతున్నాయని అధికారి తెలిపారు.
జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
Posted On 2026-07-17 17:49:23
Readmore >
భారతదేశంలో సరికొత్త విప్లవం : దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
Posted On 2026-07-17 17:07:37
Readmore >
ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం... ఏడేళ్ల బాలుడిపై బ్లేడుతో దాడి!
Posted On 2026-07-17 15:20:28
Readmore >
సోషల్ మీడియాలో పరువు నష్టం : జిందం కళ చక్రపాణి, జిందం చక్రపాణి ఎస్పీకి ఫిర్యాదు
Posted On 2026-07-17 15:09:10
Readmore >
సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్... బాధితులను పరామర్శించిన డీఎంహెచ్వో ఏంజెలా ఆల్ఫ్రెడ్
Posted On 2026-07-17 14:10:00
Readmore >
రాజన్న సిరిసిల్ల : అంగన్వాడీల ఆకస్మిక తనిఖీ... పోషకాహారంపై కలెక్టర్ కీలక ఆదేశాలు
Posted On 2026-07-17 14:04:31
Readmore >
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >