Posted on 2024-07-21 16:02:01
డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా స్థానిక జడ్పీహెచ్ఏస్ కంకర్బోర్డు పాఠశాల నందు1976-1977 విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థిని విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం సాయి కన్వెన్షన్ హాల్ నందు జరిగింది. మనవళ్ళతో మనవరాలతో సంతోషంగా గడిపే సమయం లో 47 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత వారి గురువులు మరియు తోటి మిత్రులతో కలవడం అత్యంత ఆనందయమ క్షణాలను ఆస్వాదించారు. ఈ సమయంలో అందరం కలిసి మిత్రుల పలకరింపులతో మాట్లాడేటప్పుడు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఈ జన్మలో పూర్వ మిత్రులందరిని కలవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం అని వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి నాయని వెంకటరెడ్డి అధ్యక్షత వహించగా ముందుగా గురువుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం స్వర్గస్తులైన వారి మిత్రులకు సంతాపం ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఆ సమయంలో తమకు విద్యానందించిన గురువులకు గురుపూర్ణిమ సందర్భంగా వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంఎల్ఏ మురళి నాయక్ సతి సమేతంగా పాల్గొనగా విద్యార్థుల బృందం వారిని టపాసులతో ఆహ్వానించి వారికి నూతన వస్త్రాలు బహుకరించారు.అనంతరం ఎంఎల్ఏ మురళి నాయక్ చేతుల మీదుగా గురువులకు కూడా నూతన వస్త్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో వారికి విద్యనందించిన గురువులు డి సత్యనారాయణ, దర్గయ్య, రమేశ్చందర్ రెడ్డి, సత్యనారాయణ తో పూర్వ విద్యార్ధులు గుడ్ల రవి రాజు గౌడ్ రామారావు కిష్టయ్య ఆర్ వెంకటరమణ వి వెంకటరమణ శ్రీరంగం వెంకటేశ్వర్లు ఓంజి రవి రంగా నరసింహారావు రమాదేవి అమీర్ రషీద్ అను రాధా ఉప్పల అమృతయ్య వెంకట్ రెడ్డి విజయలక్ష్మి మరియు తదితరులు పాల్గొన్నారు
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్బ్యాగ్లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >