Posted on 2024-07-21 19:32:01
డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా స్థానిక జడ్పీహెచ్ఏస్ కంకర్బోర్డు పాఠశాల నందు1976-1977 విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థిని విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం సాయి కన్వెన్షన్ హాల్ నందు జరిగింది. మనవళ్ళతో మనవరాలతో సంతోషంగా గడిపే సమయం లో 47 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత వారి గురువులు మరియు తోటి మిత్రులతో కలవడం అత్యంత ఆనందయమ క్షణాలను ఆస్వాదించారు. ఈ సమయంలో అందరం కలిసి మిత్రుల పలకరింపులతో మాట్లాడేటప్పుడు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఈ జన్మలో పూర్వ మిత్రులందరిని కలవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం అని వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి నాయని వెంకటరెడ్డి అధ్యక్షత వహించగా ముందుగా గురువుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం స్వర్గస్తులైన వారి మిత్రులకు సంతాపం ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఆ సమయంలో తమకు విద్యానందించిన గురువులకు గురుపూర్ణిమ సందర్భంగా వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంఎల్ఏ మురళి నాయక్ సతి సమేతంగా పాల్గొనగా విద్యార్థుల బృందం వారిని టపాసులతో ఆహ్వానించి వారికి నూతన వస్త్రాలు బహుకరించారు.అనంతరం ఎంఎల్ఏ మురళి నాయక్ చేతుల మీదుగా గురువులకు కూడా నూతన వస్త్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో వారికి విద్యనందించిన గురువులు డి సత్యనారాయణ, దర్గయ్య, రమేశ్చందర్ రెడ్డి, సత్యనారాయణ తో పూర్వ విద్యార్ధులు గుడ్ల రవి రాజు గౌడ్ రామారావు కిష్టయ్య ఆర్ వెంకటరమణ వి వెంకటరమణ శ్రీరంగం వెంకటేశ్వర్లు ఓంజి రవి రంగా నరసింహారావు రమాదేవి అమీర్ రషీద్ అను రాధా ఉప్పల అమృతయ్య వెంకట్ రెడ్డి విజయలక్ష్మి మరియు తదితరులు పాల్గొన్నారు
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >