Posted on 2024-07-15 12:37:07
వ్యాధులు ప్రబలకుండా జాగ్రతలు తీసుకోవాలి
ఆరోగ్యశాఖ సిబ్బందితో ఎమ్మెల్యే సమావేశం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులతో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశానికి ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు జిల్లా వైద్యశాఖ ఉపాధికారి డాక్టర్ విజయలక్ష్మి నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశం సోమవారం ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు సూచనలు సలహాలు అధికారులకు జారీ చేశారు. వైద్య అధికారులు వారి హాస్పిటల్లో అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన మేరకు సేవలు అందించాలని ఎమ్మెల్యే కోరారు. గ్రామాల్లో కార్యదర్శులతో సమన్వయం చేసుకొని గ్రామాల్లో సీజనల్ వ్యాధులు పై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు..
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >