| Daily భారత్
Logo




జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి దోస్తీ మీట్ - 2024 కబడ్డీ, వాలీబాల్ పోటీలు

News

Posted on 2024-07-12 21:18:02

Share: Share


జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి దోస్తీ మీట్ - 2024 కబడ్డీ, వాలీబాల్ పోటీలు

యువత చెడు వ్యాసనాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలవైపు సాగాలి.

గంజాయి నిర్ములనకు యువత నడుం బిగించాలి

యువత క్రీడల్లో  గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తూ అదే స్ఫూర్తిని నిజ జీవితంలో అలవర్చుకోవాలి.

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి దోస్తీ మీట్ - 2024 కబడ్డీ, వాలీబాల్ పోటీలు.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: శుక్రవారం రోజున దోస్తీ మీట్ - 2024  మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీల్లో గెలుపోయిందిన జట్లతో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన పోటీలకు ముఖ్య అతిదిగా హాజరై బహమతులు అందజేషిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

మండల స్థాయిలో గెలుపొందిన 17 కబడ్డీ జట్లు,12 వాలిబల్ జట్లు జిల్లా స్థాయిలో పాల్గొనడం జరిగింది.

కబడ్డీ ఫైనల్ మ్యాచ్ లో వేములవాడ రూరల్,వీర్నపల్లి జట్లు పాల్గొనగా

1.మొదటి ప్లేస్ : వేములవాడ రూరల్ టీమ్ 

2.రెండవ ప్లేస్: వీర్నపల్లి టీమ్

3.మూడవ ప్లేస్ : రుద్రంగి

వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ లో వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట్ జట్లు పాల్గొనగా.

1.మొదటి ప్లేస్ : రుద్రంగి

2.రెండవ ప్లేస్ :ఎల్లారెడ్డిపేట్ B టీం

3.మూడవ ప్లేస్: ఎల్లారెడ్డిపేట్ A టీమ్

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...

దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలో ఉంటుందని, చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని, అదే ఉద్దేశ్యంతో కమ్యూనిటీ  పోలీసింగ్ లో భాగంగా జిల్లాలో యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు,మాధకద్రవ్యాల వలన కలుగు అనార్దలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి మండల స్థాయిలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దోస్తీ మీట్ - 2024 లో భాగంగా కబడ్డీ వాలీబాల్  పోటీలు నిర్వహించి మండల స్థాయిలో గెలుపోయిందిన జట్లకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు.

యువత చదువుతో పాటుగా అన్ని రంగాల్లో రాణించాలని, క్రీడల్లో ప్రతి ఒక్కరు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని, అదే స్ఫూర్తి ని నిజ జీవితంలో అలవర్చుకుంటు ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు.క్రీడలలో పాల్గొనడం వల్ల శారీరకంగా,ఆరోగ్యంగా దృడంగా ఉండడంతో పాటు మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారని అన్నారు. నిజ జీవితంలో సమిష్టి కృషి తోనే విజయాలను సులువుగా చేరుకోగలమనే దానికి ఉదాహరణ క్రీడలని అన్నారు. క్రీడ ఓటమి చెందిన వారు తమ లోపాలను సవరించుకొని  ముందుకు వెళ్లడం అలవర్చుకోవాలని అన్నారు. 

ఎస్పీ వెంట వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య,డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు కృష్ణ,మోగిలి,శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ ఆర్.ఐ లు మాధుకర్, యాదగిరి, రమేష్ , ఎస్.ఐలు సిబ్బంది ,వ్యాయామ ఉపాద్యాయులు, క్రీడాకారులు ఉన్నారు.

Image 1

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత

Posted On 2026-04-29 19:01:13

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష

Posted On 2026-04-29 18:50:39

Readmore >
Image 1

చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్

Posted On 2026-04-29 18:41:17

Readmore >
Image 1

మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

Posted On 2026-04-29 18:39:55

Readmore >
Image 1

పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565

Posted On 2026-04-29 18:37:39

Readmore >
Image 1

ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..

Posted On 2026-04-29 17:26:42

Readmore >
Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >