| Daily భారత్
Logo




షాద్ నగర్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం.... పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

News

Posted on 2024-07-12 16:59:08

Share: Share


షాద్ నగర్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం.... పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

సమస్యలపై దృష్టి సారించండి

మున్సిపల్ శాఖకు షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" ఆదేశం

పారిశుద్ద్య కార్మికుల సంఖ్య పెంచాలని సూచన

వీధిలైట్ల సమస్యలను పరిష్కరించాలి

మిషన్ భగీరథ సమస్యలపై వెంటనే స్పందించండి

 అన్ని వార్డుల్లో సీసీ కెమెరాల ఆవశ్యకతపై పరిశీలించండి

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా:షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న అనేక సమస్యలపై అధికారులు స్థానిక ప్రజాప్రతితులు సిబ్బంది వెంటనే దృష్టి సారించాలని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశించారు. 

శుక్రవారం స్థానిక మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న పర్యవేక్షణలో మున్సిపల్ చైర్మన్ కే. నరేందర్ సభ అధ్యక్షతన జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి తదితర కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని, పట్టణంలోని అన్ని వార్డులలో ప్రతిరోజు పారిశుద్ధ కార్యక్రమాలు జరిగేటట్టుగా చూడాలని సభ్యులు కోరడం జరిగిందని తెలిపారు.

పురపాలక సంఘంలో చాలా ప్రదేశాలలో విద్యుత్ దీపాల సమస్యలు ఉన్నాయని, పాడైపోయిన లైటులను వెంటనే మరమ్మతు చేయించాలని కోరడం జరిగిందన్నారు. పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కోసమై గతంలో తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేసి అన్ని వార్డులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సభ్యులు కోరడం జరిగింది. మిషన్ భగీరథ నేటి విషయంలో చాలా చోట్లలో సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని సభ్యులు కోరడం జరిగింది. పురపాలక సంఘంలోని చాలా ప్రాంతాలలో హైమాస్ లైట్లు వెలగడం లేదని సభ్యులు సభ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. పారిశుద్ధ కార్మికుల ఉద్యోగానికి భద్రత కల్పించాలని వారికి ఆరోగ్య భీమా కల్పించాలని, పట్టణంలోని అన్ని వార్డులలో కుక్కల సమస్య చాలా తీవ్రంగా ఉందని సభలోని అందరి సభ్యులు అభిప్రాయపడ్డారు. వీటి నిర్మూలనకు తగిన చర్యలు చేపట్టాలని, పురపాలక సంఘంలో విలీనమైన పరిసర గ్రామాలపై ప్రత్యేక దృష్టిని సహకరించి వాటి అభివృద్ధిపై ప్రత్యేక నిధులను కేటాయించాలని సభ్యులు సమదృష్టికి తెచ్చినట్టు పేర్కొన్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికై ప్రత్యేక నిధులను కేటాయించే ప్రభుత్వంతో చర్చించి పట్టణాన్ని అభివృద్ధి పరచాలని సభ్యులందరూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రావడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు అధికారులు తదితరులు పాల్గొన్నారు..

Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >
Image 1

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-05-02 23:48:08

Readmore >
Image 1

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-02 23:19:44

Readmore >
Image 1

పత్రికా స్వేచ్ఛ… సమాజం ఊపిరి

Posted On 2026-05-02 22:28:56

Readmore >
Image 1

ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు

Posted On 2026-05-02 22:26:17

Readmore >
Image 1

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత

Posted On 2026-04-29 19:01:13

Readmore >