Posted on 2024-07-08 19:02:28
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
సన్మాన కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవి ముగిసిన సందర్భంగా షాద్ నగర్ పట్టణం కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సన్మాన సభ కార్యక్రమంలో పాల్గొన్న మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో కలిసి షాద్ నగర్ మాజీ ఎంఎల్ఏ అంజయ్య యాదవ్ పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీకి అబద్ధాలు చెప్పడం సర్వసాధారణమైనవి అని, గత రాజకీయ చరిత్ర కూడా ఇదే విషయాలను చెప్తాయని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ నాయకులు భయపడవలసిన అవసరం లేదని, ప్రజా సమస్యలపై నిత్యం ప్రజల్లో ఉండాలని కోరారు. ఏ కార్యకర్తకైనా అన్యాయం జరిగితే, మనమందరం సమిష్టిగా కార్యకర్తల పక్షాన నిలువాలని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పని చేశారే తప్పా, కార్యకర్తలను పట్టించుకోవడంలేదని విమర్శలు చేయడం సరికాదని అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వారి వారి గ్రామాలు,మండలాల అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడ్డారని, ఎన్నో నిధులను వెచ్చించి స్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, హరితహారం, పారిశుద్ధ్యం, సిసి రోడ్లు, అంతర్గత మురుగు కాలువలు, కమ్యూనిటీ భవనాలు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో చెరుగని ముద్ర వేసుకున్నారని కొనియాడా రు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, రెండువేల పింఛన్లు, గురుకుల పాఠశాలల ఏర్పాటు వంటి సంక్షేమ పథకాల అమల్లో మీరు కూడా భాగస్వాములు కావడం మనందరికీ గర్వకారణం అని చెప్పారు. వెనుకబడిన తెలంగాణను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపి, దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను నిలిపిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఆయన స్ఫూర్తితో మనమందరం రానున్న రోజుల్లో ప్రజాసేవలో భాగస్వాములు కావాలని కోరారు. ఇందులో భాగంగానే షాద్ నగర్ నియోజక వర్గంలోని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపిటిసిలను, మాజీ జడ్పిటిసిలను, మాజీ సర్పంచులను శాలువాలు, పూల మాలలతో ఘనంగా సన్మానించారు.
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >
చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
Posted On 2026-03-07 21:29:26
Readmore >
బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు
Posted On 2026-03-07 21:28:26
Readmore >
సద్గురు సేవాలాల్ మహారాజ్ బోగ్ బండరో కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు
Posted On 2026-03-07 21:22:31
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.
Posted On 2026-03-07 20:16:11
Readmore >
కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
Posted On 2026-03-07 18:14:07
Readmore >