డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వరదలకు రాష్ట్రంలోని దిబ్రూఘర్కు ఉత్తరాన బ్రహ్మపుత్ర మధ్యలో ఉన్న చిన్న ద్వీపంలో 13 మంది మత్స్యకారులు చిక్కుకున్నారు. భారత వైమానిక దళం ఐఎఎఫ్వారిని రక్షించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఎంఐ-17 IV హెలికాప్టర్ జూలై 2న సవాలుతో కూడిన వాతావరణ పరిస్థితులలో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా చేపట్టినట్లు వెల్లడించారు. అనంతరం మత్స్యకారులకు ప్రథమ చికిత్స అందించారు.
News
వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడిన ఐఎఎఫ్