Posted on 2026-03-13 17:35:18
జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దు,వందతులను నమ్మవద్దు
కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని, జిల్లాలో ఎల్.పి.జి గ్యాస్ కొరత లేదని జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దని, వందతులను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.అమెరికా-ఇరాన్ కు జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో చమురు, ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని, ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడనుందని వస్తున్న వార్తలను ప్రజలు నమ్మవద్దని, యుద్దం ప్రభావం వలన జిల్లాలో ఎలాంటి ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, ఇంతకు ముందు గ్యాస్ బుక్ చేసుకున్నా తరువాత సరఫరా ఉన్నట్లే ప్రస్తుతం కూడా అదే విధంగా గ్యాస్ సరఫరా ఉంటుందని, ఎలాంటి జాప్యం ఉండదని, జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, గృహ అవసరాలకు వినియోగించే ఎల్.పి.జి గ్యాస్ కు ఎలాంటి కొరత లేదని, అదేవిధంగా ఆసుపత్రులు, విద్యాసంస్థలకు చెందిన వసతి గృహాలు, అనాధ శరణాలయాలు, వృద్దాశ్రమాలు వంటి సంస్థలకు ఎలాంటి కొరత లేదని తెలుపుతూ, జిల్లా ప్రజలు గ్యాస్ పై వస్తున్న అవాస్తవాలను, వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >