Posted on 2026-03-13 16:46:49
డైలీ భారత్, హుజూర్ నగర్: రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకురాలు మహిళా సాధికారతకు కృషి చేస్తున్న తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా జాగృతి శ్రేణుల ఆధ్వర్యంలో శుక్రవారం హుజూర్ నగర్ పట్టణ కేంద్రం లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసి కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియ చేశారు.ఈ సందర్భంగా జాగృతి రాష్ట్ర నాయకులు కేఎల్ఎన్ రావు, షేక్ మస్తాన్ లు మాట్లాడుతూ మహిళా సాధికారత సామాజిక సేవలో ఆమె చేసిన కృషిని కొనియాడారు.
రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న నాయకురాలిగా కవిత గుర్తింపు పొందారన్నారు భవిష్యత్తులో కూడా ప్రజలకు సేవ చేస్తూ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఆమెకు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు కలగాలని కోరారు. మహిళా బిల్లు చట్టంగా రూపొందడానికి, బీసీలకు విద్యా ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ సాధనకు కవిత పోరాటం చేసారన్నారు.
ఇటీవల ఖమ్మంలో వెలుగుమట్ల గ్రామంలో ఇండ్ల కూల్చివేత బాధితుల పక్షాన నిలబడి నిరాహార దీక్ష చేసిన ఫలితంగా ప్రభుత్వం దిగి వచ్చి బాధితులకు న్యాయం చేయడం కవిత పోరాట ఫలితమన్నారు. ప్రధాన ప్రతిపక్షాలు ప్రజల సమస్యల పట్ల పోరాటం చేయడంలో విఫలమైతే కవిత ప్రశ్నించే గొంతుకై బాధితుల పక్షాన పోరాటం చేశారన్నారు.ఈ కార్యక్రమంలో కె.సత్య నారాయణ రెడ్డి, సౌదశోతు బిక్షం, మామిడి పన్నీరు, సిహెచ్ నర్సింహ రావు, పి.నర్సింహ రావు వేణు, బానోతు నర్సింహ , వెంకట కృష్ణ, గోపి నాయక్ తదితరులు పాల్గొన్నారు
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >