Posted on 2023-10-26 11:47:09
డైలీ భారత్, శ్రీకాకుళం జిల్లా: చేప ముక్క, యాభై రూపాయల కోసం జరిగిన ఘర్షణలో ఓ నిండు ప్రాణం బలయిపోయింది. వినడానికి హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఇది నిజం. గొడవ జరగకుండా ఆపడానికి వెళ్లిన పెద్దమనిషి ప్రాణాలపైకి వచ్చిన సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... శ్రీకాకుళం జిల్లా, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి రెండో వార్డులోని సాయిబుల కోలనీలో మంగళవారం రాత్రి జరిగిన ఓ విచిత్ర సంఘటనలో నిండు ప్రాణం బలయ్యింది. సాయిబుల కాలనీలో పెయింటర్లుగా జీవనం సాగిస్తున్న ఇరువురు వ్యక్తులు కూలి డబ్బులు యాభై రూపాయలతో పాటు చేప ముక్క కోసం మంగళవారం రాత్రి గొడవపడ్డారు. అయితే సయ్యద్ ఖాదర్ అనే 70 ఏళ్ల వృద్ధుడు గొడవను ఆపే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. గొడవకు దిగిన ఇరువురు మద్యం తాగి ఉండడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే ఖాదర్ పై ఓ స్టీల్ చెంబుతో షేక్ దాసు అనే వ్యక్తి తల, చాతీపై దాడి చేయడంతో మృత్యువాత పడినట్లు కాశిబుగ్గ పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి ఇన్చార్జి సీఐ రవిప్రసాద్ తన సిబ్బందితో చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే వీరి మధ్య పాత తగాదాలకు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
గంభీరావుపేట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అఖండ జ్యోతికి ప్రత్యేక గుర్తింపు
Posted On 2026-04-03 07:28:57
Readmore >
పాల్వంచ లో ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర(బజరంగ్దళ్ బైక్ ర్యాలీ)
Posted On 2026-04-03 06:40:29
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో రోడ్లు శుభ్రపరిచిన శానిటేషన్ సిబ్బందికి కృతజ్ఞతలు
Posted On 2026-04-03 04:36:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వరకట్నం హత్య కేసులో భర్తతో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు
Posted On 2026-04-03 03:53:18
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : ముగ్గురు అంతర్ జిల్లా దొంగలు అరెస్టు, రిమాండ్ తరలింపు
Posted On 2026-04-03 03:51:24
Readmore >
హెచ్ పీ గ్యాస్ బాధితులా నిరసనలు తహసీల్దార్ కీ పిర్యాదులు...
Posted On 2026-04-03 03:27:41
Readmore >
దేశ వ్యాపంగా సంచలనం సృష్టించిన సైబర్ క్రైమ్ కేస్ లో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులను అరెస్టు చేసిన సత్తుపల్లి పోలీసులు
Posted On 2026-04-03 03:25:40
Readmore >