Posted on 2023-10-24 13:53:36
- నేలకొండపల్లి మండలంలో బీఆర్ఎస్ నేతలు పలువురి రాజీనామా
- పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక
డైలీ భారత్ , నేలకొండపల్లి : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ అసంతృప్తులంతా ఒక్కొక్కరిగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఆ పార్టీలోని కొందరి నేతల అధిపత్య పోరు తమకు ఇబ్బందికరంగా ఉందని చెబుతూ... ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. పార్టీకి రాజీనామా చేసిన వారంతా పొంగులేటి శీనన్న వెంటే ఉంటామంటూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలానికి చెందిన మాజీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు తేజావత్ కోటేశ్వరరావు, వార్డు మెంబర్ భూక్య భారతి, ధీరావత్ శ్యామాలి, రాజారాం పేట పీఏసీఎస్ వైస్ చైర్మన్ ధీరావత్ బాలాజీ, గోబ్రియా, యూత్ నాయకులు వీరన్న, వంశీ తదితరులు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. అనంతరం ఖమ్మంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బత్తుల నారాయణ, బండారి సురేందర్ రెడ్డి
Posted On 2026-04-03 12:54:57
Readmore >
మహబూబాద్ జిల్లా డా. ఎస్పీశబరీష్. ను మర్యాదపూర్వకంగా కలిసిన గూడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వర్ష వినయ్ కుమార్
Posted On 2026-04-03 12:13:27
Readmore >
గంభీరావుపేట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అఖండ జ్యోతికి ప్రత్యేక గుర్తింపు
Posted On 2026-04-03 07:28:57
Readmore >
పాల్వంచ లో ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర(బజరంగ్దళ్ బైక్ ర్యాలీ)
Posted On 2026-04-03 06:40:29
Readmore >