Posted on 2024-05-27 15:39:28
ఆధునిక భారతదేశ రూపశిల్పి
షాద్ నగర్ ఎమ్మెల్యే, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి "వీర్లపల్లి శంకర్"
ప్రొఫెసర్ రాజ హర్షణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంత రావు, మహేష్ కుమార్ గౌడ్, జీవన్ రెడ్డి సునీతా రావు, అజహరుద్దీన్ హాజరు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : మన మొదటి ప్రధానమంత్రి మరియు "ఆధునిక భారత రూపశిల్పి" అయిన పండిట్ జవహర్లాల్ నెహ్రూను ఆయన వర్ధంతి సందర్భంగా స్మరించుకుంటం మన కర్తవ్యం అని, అనేక ఆర్థిక విధానాలు మరియు పారిశ్రామిక సంస్థల ద్వారా దేశాన్ని గొప్ప ఎత్తులకు నడిపించిన దార్శనికుడు,"అంటూ షాద్ నగర్ ఎమ్మెల్యే, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి "వీర్లపల్లి శంకర్" పేర్కొన్నారు. భారత దివంగత ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన వర్ధంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్ తో పాటు ప్రొఫెసర్ రాజ హర్షణ్,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు, మహేష్ కుమార్ గౌడ్, జీవన్ రెడ్డి సునీతా రావు, అజహరుద్దీన్, నరసింహారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సభలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడారు..
1889లో జన్మించిన నెహ్రూ భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేశారని అతను ఆగస్టు 1947 మరియు మే 1964 మధ్య ప్రధాన మంత్రిగా ఉన్నారన్నారు. అతను మే 27, 1964 న మరణించారని విచారం వ్యక్తం చేశారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ సహకారం లేకుండా 21వ శతాబ్దపు భారతదేశాన్ని ఊహించలేమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం యొక్క నిర్భయ సైనికుడు, అతని ప్రగతిశీల ఆలోచనలు సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశం యొక్క సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక అభివృద్ధిని బలంగా నెహ్రూను ముందుకు నడిపించాయని అన్నారు. " హింద్ కే జవహర్" కి నా వినయపూర్వకమైన నివాళి " అని ఆయన అన్నారు..
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >