Posted on 2023-10-14 18:21:06
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పై టి.పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సిరిసిల్లలోని మున్నూరు కాపు నేతలు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ బిడ్డ అయిన పొన్నాల లక్ష్మయ్య పై ఇలాంటి వ్యాఖ్యలు తగదని రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డిని తెలంగాణలో తీరగనీయకుండా చేస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి పొన్నాల లక్ష్మయ్య కున్న రాజకీయ అనుభవం లేదని, పొన్నాల లక్ష్మయ్య ను విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డిది కాదని మండిపడ్డారు. పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని దాన్ని గుర్తించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. కేవలం బీసీల పట్ల చిన్న చూపు తోనే రేవంత్ రెడ్డి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశాడని అన్నారు. రానున్న రోజుల్లో ఓట్ల ద్వారానే రేవంత్ రెడ్డికి సమాధానం చెబుదామని అన్నారు ఈ కార్యక్రమంలో హాడక్ కమిటి కన్వీనర్ అగ్గి రాములు,ఆకుల కృష్ణ, కల్లూరి రాజు, కల్లూరి మధు, హాడక్ కమిటి సభ్యులు మున్నూరు కాపు సభ్యులు పాల్గొన్నారు.
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ పైన అవగాహన కార్యక్రమము
Posted On 2026-03-12 17:34:10
Readmore >
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు శిక్షణ
Posted On 2026-03-12 17:29:36
Readmore >
లిమ్స్ హాస్పిటల్ ను ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
Posted On 2026-03-12 17:28:11
Readmore >
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రజలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీప్రభుత్వం
Posted On 2026-03-12 13:45:42
Readmore >
మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 𝟓 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష
Posted On 2026-03-12 13:44:39
Readmore >
భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
Posted On 2026-03-12 12:57:08
Readmore >