Posted on 2023-10-14 14:51:06
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పై టి.పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సిరిసిల్లలోని మున్నూరు కాపు నేతలు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ బిడ్డ అయిన పొన్నాల లక్ష్మయ్య పై ఇలాంటి వ్యాఖ్యలు తగదని రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డిని తెలంగాణలో తీరగనీయకుండా చేస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి పొన్నాల లక్ష్మయ్య కున్న రాజకీయ అనుభవం లేదని, పొన్నాల లక్ష్మయ్య ను విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డిది కాదని మండిపడ్డారు. పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని దాన్ని గుర్తించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. కేవలం బీసీల పట్ల చిన్న చూపు తోనే రేవంత్ రెడ్డి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశాడని అన్నారు. రానున్న రోజుల్లో ఓట్ల ద్వారానే రేవంత్ రెడ్డికి సమాధానం చెబుదామని అన్నారు ఈ కార్యక్రమంలో హాడక్ కమిటి కన్వీనర్ అగ్గి రాములు,ఆకుల కృష్ణ, కల్లూరి రాజు, కల్లూరి మధు, హాడక్ కమిటి సభ్యులు మున్నూరు కాపు సభ్యులు పాల్గొన్నారు.
ఆటో కార్మికుల హక్కులను విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
Posted On 2026-08-17 13:45:49
Readmore >
గలిగే లక్ష్మయ్య (చంటి) చిత్ర పటానికి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-08-17 13:42:50
Readmore >
రాజ్భవన్లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం
Posted On 2026-08-15 18:03:53
Readmore >
16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust
Posted On 2026-08-15 17:50:48
Readmore >
గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్కు డిజిటల్ పరికరాలు
Posted On 2026-08-15 17:49:14
Readmore >
విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-08-15 16:55:47
Readmore >