Posted on 2023-10-14 18:21:06
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పై టి.పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సిరిసిల్లలోని మున్నూరు కాపు నేతలు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ బిడ్డ అయిన పొన్నాల లక్ష్మయ్య పై ఇలాంటి వ్యాఖ్యలు తగదని రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డిని తెలంగాణలో తీరగనీయకుండా చేస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి పొన్నాల లక్ష్మయ్య కున్న రాజకీయ అనుభవం లేదని, పొన్నాల లక్ష్మయ్య ను విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డిది కాదని మండిపడ్డారు. పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని దాన్ని గుర్తించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. కేవలం బీసీల పట్ల చిన్న చూపు తోనే రేవంత్ రెడ్డి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశాడని అన్నారు. రానున్న రోజుల్లో ఓట్ల ద్వారానే రేవంత్ రెడ్డికి సమాధానం చెబుదామని అన్నారు ఈ కార్యక్రమంలో హాడక్ కమిటి కన్వీనర్ అగ్గి రాములు,ఆకుల కృష్ణ, కల్లూరి రాజు, కల్లూరి మధు, హాడక్ కమిటి సభ్యులు మున్నూరు కాపు సభ్యులు పాల్గొన్నారు.
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >
హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు
Posted On 2026-06-19 16:24:52
Readmore >
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >