Posted on 2024-04-05 18:35:08
ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ డిమాండ్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ నందు పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిరిసిల్లలోని కార్మిక భవన్ నందు ఏఐటియుసి రాజన్నా సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అధ్యక్షతన జరిగిన రెండవ ఏఎన్ఎంల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పెద్ద 16 సంవత్సరాల నుండి కాంట్రాక్టు పాధిపతికిన పనిచేస్తున్న రెండవ పనిచేస్తున్నారన్నారు. వాస్తవానికి రెండవ ఏఎన్ఎం లకు తీసుకున్నప్పుడు మొదటి ఏఎన్ఎంకు సహాయకురాలిగా మాత్రమే తీసుకున్నారని కానీ ఇప్పుడు మొదటి ఏఎన్ఎం తో సమానంగా పనిచేస్తున్నారన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయే కానీ వీరి జీవితాల్లో ఎటువంటి మార్పు రావడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండవ ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తోట రామాంజనేయులు మాట్లాడుతూ భారత దేశవ్యాప్తంగా 1,57,935 మంది రెండవ రెండవ ఏఎన్ఎం లు పనిచేస్తున్నారని కానీ తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే 5000 మంది ఏఎన్ఎం లతో పోలిస్తే మిగిలిన వారి పని చాలా తక్కువ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనులతో వీరు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రోజుకు 10 నుండి 12 గంటల పాటు ప్రభుత్వం వీరితో వెట్టిచాకిరి చేయించుకుంటుందని ఆన్లైన్ ఆఫ్లైన్ పనులు కూడా చేయించుకుంటుందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 16 లో రెండవ ఏఎన్ఎం లను కూడా చేర్చి వీరిని రెగ్యులర్ చేయాలన్నారు. సమ్మె కాలంలో గత ప్రభుత్వం ఇచ్చిన 100% గ్రాస్ శాలరీని వెంటనే అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. త్రిసభ్య కమిటీ సమా వేశపరిచి పని భారం తగ్గించడానికి కృషి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే రోజులలో వీరి సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను నిర్వహించినట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు అజ్జా వేణు , రెండవ ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర నాయకురాలు రాజేశ్వరి , జిల్లా నాయకురాలు వజ్రమ్మ , వసంత, జ్యోతీ తదితరుల పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పాత్రపై భావోద్వేగంగా మాట్లాడిన కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-08 11:17:27
Readmore >
మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి
Posted On 2026-03-08 08:40:36
Readmore >
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >
చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
Posted On 2026-03-07 21:29:26
Readmore >
బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు
Posted On 2026-03-07 21:28:26
Readmore >