Posted on 2023-10-13 09:50:19
డైలీ భారత్ ,తాడేపల్లిగూడెం: ఎర్నాకులం జంక్షన్ టు హటాయి వెళుతున్న దర్తి అబ్బా ఎక్స్ప్రెస్ లో పురుడు పోసుకున్న మహిళ. 3టైర్ A/C లో B13 లో రశ్మిత (23) కోయంబత్తూర్ నుండి బాలంగిరి ప్రయాణం చేస్తున్న క్రమంలో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సమీప ప్రాంతంలో పురుడు పోసుకున్న మహిళ. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. భర్త సుశాంత్ తో రశ్మిత పురిటి కోసం పుట్టింటికి వెళుతూ రైలులోనే పురుడు పోసుకున్న సంఘటన తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. వెంటనే చైన్ లాగి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చిన భర్త మరియు టి సి. అప్రమత్తమైన రైల్వే అధికారులు 108కు సమాచారం అందించడంతో పైలట్ నీలిపాల దినేష్, ఈ ఎన్ టి అనూష రైల్వే స్టేషన్ కి చేరుకొని రస్మితకు ప్రథమ చికిత్స చేసి తదనంతరం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తక్షణమే స్పందించిన వైద్యులు ఏరియా ఆసుపత్రి అవసరమైన అన్ని చికిత్సలు అందించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సుశాంత్ తెలియజేశారు.
విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి
Posted On 2026-03-11 20:27:35
Readmore >
కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం
Posted On 2026-03-11 20:23:40
Readmore >
కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి
Posted On 2026-03-11 19:25:18
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-03-11 18:48:15
Readmore >
పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు సంఘం నాయకులు
Posted On 2026-03-11 18:46:41
Readmore >