Posted on 2024-02-28 17:43:10
డైలీ భారత్, ఖమ్మం : నా పర్యటనల పట్ల ప్రత్యేక ఆంక్షలెందుకు అని మంత్రి తుమ్మల పోలీసులను ప్రశ్నించారు. బుధవారం రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన క్యాంపు కార్యాలయంలో ఖమ్మం నగర పోలీసు అధికారులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
ముఖ్యంగా నగరంలో తన పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించి సామాన్యులను ఇబ్బందులకు గురిచేయొద్దని, తన కాన్వాయ్ లో ట్రాఫిక్ పోలీస్ వెహికిల్ తప్ప వేరే వాహనాలు అవసరం లేదని, అదే విధంగా వివిధ స్టేషన్ల పరిధి నుండి వచ్చే లైజనింగ్ వాహనాలు కాన్వాయ్ లో అవసరం లేదని అన్నారు. వారు తమ స్టేషన్లలో విధులు నిర్వహించుకావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర ఏసీపీ రమణ మూర్తి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, టూ టౌన్ సీసిఐ బాలకృష్ణ, ట్రాఫిక్ సీఐ మోహన్ బాబు, ట్రాఫిక్ ఎస్సై రవి కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >