Posted on 2024-02-28 18:43:35
గద్వాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సరిత స్కూల్ సిబ్బంది, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికి జ్యోతి ప్రజ్వాలన చేయించారు
చిన్నారుల ఏర్పాటు చేసిన కళాకండాలు, సైన్స్ ఆవిష్కరణలు, నాటికలు, సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
డైలీ భారత్, గద్వాల: జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ.. ఈరోజు శ్రీ చైతన్య స్కూల్ లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెర్ కార్యక్రమాన్ని ఆహ్వానించిన స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదములని చిన్నారులతో కలిసిపోవడం చాలా ఆనందంగా, అద్భుతంగా ఉందని చిన్నారుల ఆవిష్కరణలు ఎంతగానో ఆకట్టుకున్నాయని చిన్నారులు తమ ఆవిష్కరణల గురించి చక్కగా వివరించారని తెలిపారు.
ప్రతి విద్యార్ధి తన అభిరుచులకు తగ్గట్టుగా వయసుకు మించిన ఆలోచన శక్తితో ఎంతో అద్భుతంగా కళాకృతులను, సాంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం భాగుందని సైన్స్ ఫెర్ లాంటి కార్యమాలు చిన్నారుల సృజన శక్తికి పదును పెడుతుందని ఇటువంటి కార్యక్రమాలు చిన్నారులను భవిష్యత్తులో తమ లక్ష్యలను నిర్దారించుకునేందుకు చాలా ఉపయోగ పడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >