Posted on 2026-07-19 05:13:05
BRS పార్టీ సుజాతనగర్ మండల అధ్యక్షులు లావుడ్యా సత్యనారాయణ నాయక్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం, మనుబోతులపాడు పంచాయతీ వేములూరు గ్రామంలో పోడు భూముల సాగులో ఉన్న ఆదివాసీలపై అటవీ అధికారులు జరిపిన దాడులు, దౌర్జన్యం అత్యంత దుర్మార్గమైనవని BRS పార్టీ సుజాతనగర్ మండల అధ్యక్షులు లావుడ్యా సత్యనారాయణ నాయక్ తీవ్రంగా ఖండించారు గత 30 సంవత్సరాల నుండిఏళ్లుగా ఆదివాసీలు సాగు చేసుకుంటున్న దాదాపు 35 హెక్టార్ల పోడు భూమిని అటవీ అధికారులు బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయడం అన్యాయమన్నారు. అధికారుల విచక్షణారహిత పోడు మహిళా రైతులపై దాడి వల్ల ఆరుగురు ఆదివాసి మహిళలకు తీవ్ర గాయాలయ్యాయని, మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురిచేసిన అటవీశాఖ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ మరియు అత్యాచార కేసులు నమోదు చేయాలన్నారు.ఆదివాసుల భూములను లాక్కోవాలని చూస్తే BRS పార్టీ మరియు అనుబంధ సంఘాల నాయకులు చూస్తూ ఊరు కోము అని, జిల్లాలో ఆదివాసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారి పక్షాన అండగా నిలబడతామని స్పష్టం చేశారు. వేములూరు గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, సర్వేలు పూర్తి చేసి పోడు భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ ప్రత్యేక చొరవ తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఆదివాసులకు న్యాయం చేయాలని లేనియెడల పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనుల పక్షాన బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లావుడ్యా సత్యనారాయణ నాయక్ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు
కామారెడ్డి లో నూతనంగా టాటా ఇన్సూరెన్స్ టాటా ఏఐ ఏ కార్యాలయం ప్రారంభం
Posted On 2026-07-19 08:03:14
Readmore >
ఆదివాసి మహిళలపై దాడి చేసిన అటవీ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి
Posted On 2026-07-19 05:13:05
Readmore >
జూలూరుపాడు పోలీసుల వాహన తనిఖీలలో ముగ్గురు వ్యక్తుల వద్ద డ్రై గంజాయి స్వాధీనం
Posted On 2026-07-19 04:48:37
Readmore >
శాస్త్రీయ దర్యాప్తుతో కామారెడ్డి మహిళ హత్య కేసు ఛేదన... నిందితుడి అరెస్ట్
Posted On 2026-07-19 02:59:36
Readmore >
స్కూల్ పిల్లల ప్రాణాలతో చెలగాటం... టాటా ఏసీలో 19 మందిని కూర్చోబెట్టి ప్రయాణం!
Posted On 2026-07-18 16:06:04
Readmore >
డిగ్రీ కాలేజ్ ఎదురుగా అక్రమ మద్యం అడ్డా... లక్ష్మీ మెస్ నిర్వాహకుడిపై కేసు
Posted On 2026-07-18 15:41:39
Readmore >
నూతన బాధ్యతలు స్వీకరించిన పోలీసు అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-07-18 15:37:06
Readmore >