Posted on 2026-07-19 04:48:37
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు పరిధిలో గోపీకృష్ణ నర్సరీ ఎదుట, కొత్తగూడెం–ఖమ్మం బి.టి. రోడ్డుపై పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలలో డ్రై గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో OD 10 H 4342 నంబరు గల మహీంద్రా జైలో (Mahindra XYLO) వాహనాన్ని పరిశీలించగా, అందులో ప్రయాణిస్తున్న వికాస్ మండల్ (46), త్రినాథ్ బిసోయి మరియు గణేష్ ముదులి (21) అనే ముగ్గురు వ్యక్తుల వద్ద 100 గ్రాముల చొప్పున మూడు (03) ప్యాకెట్ల డ్రై గంజాయి లభ్యమైంది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.5,000 అంచనా నిందితుల వద్ద నుండి డ్రై గంజాయిని పంచసాక్షుల సమక్షంలో చట్టబద్ధంగా స్వాధీనం చేసుకుని సీజ్ పంచనామా నిర్వహించారు. అనంతరం నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం (NDPS Act) సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జూలూరుపాడు పోలీసులు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ మరియు వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం తనిఖీలునిర్వహిస్తున్నారని, ప్రజలు మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఏదైనా తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేసి పోలీసులకు సహకరించాలని జూలూరుపాడు ఎస్ఐ జీనత్ తెలియజేసినారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
కామారెడ్డి లో నూతనంగా టాటా ఇన్సూరెన్స్ టాటా ఏఐ ఏ కార్యాలయం ప్రారంభం
Posted On 2026-07-19 08:03:14
Readmore >
ఆదివాసి మహిళలపై దాడి చేసిన అటవీ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి
Posted On 2026-07-19 05:13:05
Readmore >
జూలూరుపాడు పోలీసుల వాహన తనిఖీలలో ముగ్గురు వ్యక్తుల వద్ద డ్రై గంజాయి స్వాధీనం
Posted On 2026-07-19 04:48:37
Readmore >
శాస్త్రీయ దర్యాప్తుతో కామారెడ్డి మహిళ హత్య కేసు ఛేదన... నిందితుడి అరెస్ట్
Posted On 2026-07-19 02:59:36
Readmore >
స్కూల్ పిల్లల ప్రాణాలతో చెలగాటం... టాటా ఏసీలో 19 మందిని కూర్చోబెట్టి ప్రయాణం!
Posted On 2026-07-18 16:06:04
Readmore >
డిగ్రీ కాలేజ్ ఎదురుగా అక్రమ మద్యం అడ్డా... లక్ష్మీ మెస్ నిర్వాహకుడిపై కేసు
Posted On 2026-07-18 15:41:39
Readmore >
నూతన బాధ్యతలు స్వీకరించిన పోలీసు అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-07-18 15:37:06
Readmore >