Posted on 2026-07-18 16:06:04
రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ:స్కూల్ పిల్లల భద్రతను ప్రైవేటు పాఠశాలలు గాలికొదిలేస్తున్నాయి. వేములవాడ పరిధిలోని నందికమాన్ వైపు వెళ్తున్న ప్రైవేటు స్కూల్కు చెందిన టాటా ఏసీ వాహనంలో 19 మంది విద్యార్థులను ఒకేసారి ప్రమాదకరంగా తరలిస్తుండగా టీఆర్పీ నేతలు పట్టుకున్నారు.
ఈ విషయాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ మీడియాకు వెల్లడించారు. వాహన సామర్థ్యానికి మించి పిల్లలను ఎక్కించి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. వెంటనే వాహనాన్ని ఆపి DTO, ట్రాఫిక్ SIలకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
ఇటీవల అనుపురం వద్ద జరిగిన వలస కూలీల ప్రమాదం ఇంకా మరువక ముందే, స్కూల్ యాజమాన్యాలు, RTA, పోలీస్ శాఖల్లో ఎలాంటి మార్పు రాకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
ప్రధాన డిమాండ్లు:
నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల సీజ్
స్కూళ్లకు నోటీసులు, యాజమాన్యాలపై కఠిన చర్యలు
జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలి
ఈ మేరకు జిల్లా DTO, DPO, ట్రాఫిక్ అధికారులకు రాతపూర్వక ఫిర్యాదు అందజేయనున్నట్లు దండు వినోద్ పేర్కొన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
#StudentSafety #Sircilla #Vemulawada #Telangana
స్కూల్ పిల్లల ప్రాణాలతో చెలగాటం... టాటా ఏసీలో 19 మందిని కూర్చోబెట్టి ప్రయాణం!
Posted On 2026-07-18 16:06:04
Readmore >
డిగ్రీ కాలేజ్ ఎదురుగా అక్రమ మద్యం అడ్డా... లక్ష్మీ మెస్ నిర్వాహకుడిపై కేసు
Posted On 2026-07-18 15:41:39
Readmore >
నూతన బాధ్యతలు స్వీకరించిన పోలీసు అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-07-18 15:37:06
Readmore >
రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సమీక్ష
Posted On 2026-07-18 15:35:33
Readmore >
8 ఏళ్ల తర్వాత కూడా నేరెళ్ల గాయం పచ్చిగానే ఉంది... బాధిత కుటుంబానికి అండగా టిఆర్ఎస్
Posted On 2026-07-18 15:26:59
Readmore >
సిరిసిల్ల జిల్లాలో మొబైల్ షాపులకు కొత్త నిబంధనలు... సమాచారం ఇస్తే ప్రశంసాపత్రం
Posted On 2026-07-18 14:02:57
Readmore >
24 గంటల వ్యవధిలో మెడికో విద్యార్థిని, ప్రియుడు చరణ్ అనుమానాస్పద మృతి!
Posted On 2026-07-18 10:20:51
Readmore >