Posted on 2024-02-26 19:08:27
డైలీ భారత్, సిరిసిల్ల : ఈ రోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ డి ఐ ఈ ఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు ఇంటర్ హాల్ టికెట్లు కొరకై ఇంటర్ విద్యార్థులను కొన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న కాలేజ్ యాజమాన్యాలు హాల్ టికెట్ల విషయంలో ఇబ్బందులు గురిచేస్తున్నారు అని పరీక్ష సమాయల్లో ఇలా చేయడం వల్ల విద్యార్థులు మానసికంగా ఇబ్బందులకు గురి అవుతున్నారు అని ఎగ్జామ్స్ పట్ల సరిగా దృష్టి పెట్టలేక పోతున్నారు అని కాబట్టి అట్టి కళాశాల ల మీద చర్యలు తీసుకోవాలని విద్యార్థుల బంగారు భవిష్యత్తునీ దృష్టిలో ఉంచుకొని వారికి వెంటనే హాల్ టికెట్లు ఇవ్వలని కోరడం జరిగింది పరీక్షల సమయంలో వారిని ఇబ్బందికి గురి చేయకుండా చూడాలని దీనిని దృష్టిలో పెట్టుకొని విద్యార్ధుల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది దీనికి గాను డి ఐ ఈ ఒ సానుకూలంగా స్పందించి విద్యార్థులు ఎలాంటి ఆందోళనల చెందవద్దు అని కళాశాలల యాజమాన్యాలు ఫీజుల విశయం లో కానీ ఇతర ఏ విశయం లో అయిన ఇబ్బందులు పెట్టిన తన దృష్టికి తీసుకురావాలని అంతే కాకుండా విద్యార్థులు డైరెక్ట్ గా ఆన్లైన్ సెంటర్లో హల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కళాశాల ప్రిన్సిపాల్ సంతకం కూడా అవసరం లేదు అని చెప్పడం జరిగింది .ఇంటర్ విద్యార్థులు అందరూ దీనిని గ్రహించి తమ దృష్టిని విద్య పైన పెట్టీ మంచిగా చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్ నాయకులు కరుణాకర్.రుద్రవేని సుదీప్.సందీప్ . కొండి నవీన్. గౌరు రాకేష్.పోతర్ల గణేష్.జగన్.నరేష్ .తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >